/rtv/media/media_files/2025/02/20/Yo4M52CDJpOa6B0YDkz5.jpg)
karnataka
తెలంగాణలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన మహిళా వైద్యురాలు, తన స్నేహితులతో కలిసి కర్ణాటకలోని సనాపూర్ సమీపంలోని తుంగభద్ర నదికి వెళ్లారు. అక్కడ తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి వెళ్లారు. నీటిలోకి దూకిన తరువాత ప్రవాహానికి డాక్టర్ కొట్టుకుపోయారు.
నీటిలో కొట్టుకుపోయిన యువతి హైదరాబాద్లోని నాంపల్లి ప్రాంతానికి చెందిన అనన్యరావు మోహన్రావుగా గుర్తించారు. ఆమె హైదరాబాద్లోని వీకేసీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నట్లు సమాచారం.పూర్తి వివరాల్లోకి వెళితే అనన్యరావు మోహన్రావు , తన స్నేహిరాలు అషిత, స్వాతిక్లతో కలిసి మంగళవారం సాయంత్రం విహారయాత్రకు కర్ణాటకలోని గంగావతి జిల్లాకు వెళ్లారు.
Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
నీటి ఉధృతికి...
సనాపూర్ సమీపంలోని వైట్ సాండ్ అనే గెస్ట్హౌస్కు చేరుకున్నారు. వారు ముగ్గురు గెస్ట్హౌస్ వెనుక ఉన్న తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లారు.వీరిలో అనన్య ఈత కొట్టాలనే ఉద్దేశ్యంతో సమీపంలోని గట్టు పైనుంచి నీటిలోకి దూకింది. తుంగభద్ర నదిలోని నీటి ఉధృతికి ఆమె కొట్టుకుపోయిందని స్నేహితులు తెలిపారు. వారిచ్చిన సమాచారంతో అనన్య కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. డాక్టర్ నీటిలోకి దూకుతున్న దృశ్యాలు ఆమె స్నేహితురాలి మొబైల్ ఫోన్లో రికార్డు అయ్యాయి.
Also Read: Elon Musk:ఇంటర్వ్యూ కోసం వెళ్లి రొమాన్స్ చేశా.. అందుకు బదులుగా మస్క్ నాకు ఏమి ఇచ్చాడో తెలుసా!
Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్లలోకి డబ్బులు!