Himachal Pradesh: భారీ వరదలతో అల్లాడుతున్న హిమాచల్ ప్రదేశ్.. 20 మందికి పైగా?

హిమాచల్ ప్రదేశ్‌లో ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని మునిగిపోయాయి. ఈ వరదల వల్ల ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 

New Update
Himachal Pradesh

Himachal Pradesh

భారీ వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఏకధాటిగా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని మునిగిపోయాయి. ఈ భారీ వరదలకు ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జలవిద్యుత్తు ప్రాజెక్టు సమీపంలో ఉన్న లేబర్‌ కాలనీకి చెందిన కార్మికులు దాదాపుగా ఒక 20 మంది వరదల్లో కొట్టుకుపోయి ఉంటారని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

ఇది కూడా చూడండి: Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్‌

నదుల్లో నీటి మట్టం పెరిగి..

మరికొందరు సమీపంలో ఉన్న ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కుండపోత వర్షాలకు బియాస్, సట్లెజ్‌ నదుల్లో నీటిమట్టం పెరగడంతో ప్రజలు భయపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు