/rtv/media/media_files/2025/01/17/IxT6HGrSl1xfIPLJnqxe.jpg)
Maoists
Chhattisgarh : వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా పరిధిలోని పర్సేఘడ్ లో నలుగురు మావోయిస్టులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో మావోయిస్టు నేతలు సంజయ్ కొర్రామ్, సంతోష్ కుమార్, సురేష్, మనోజ్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా అరెస్ట్ అయిన మావోయిస్టులపై గతంలో రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీరంతా పోలీసు వాహనాలను లక్ష్యంగా చేసుకొని IED బాంబులతో దాడులు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. చత్తీస్ గఢ్ పర్సేఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై రహస్య సమాచారం అందుకున్న పోలీసులు వరుసగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురు మావోయిస్టులు భద్రతాబలగాలకు చిక్కారు.
కాగా ఈ ఆపరేషన్లో పట్టుబడ్డ మావోయిస్టుల నుంచి 10 కిలోల ఐఇడీ బాంబు, డిటోనేటర్లు, ఇతర మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు. అరెస్టయిన మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో పాల్గొన్నారని, సుర్గుజా, బలరాంపూర్ జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని సుర్గుజా ఎస్పీ విజయ్ అగర్వాల్ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.