/rtv/media/media_files/2025/06/25/gadwal-murder-case-2025-06-25-19-24-08.jpg)
Gadwal murder case
Surveyor Tejeshwar Murder: గత కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు పోలీసులకు చిక్కాడు. తిరుమలరావును పోలీసులు బుధవారం శంషాబాద్ ఎయిర్ఫోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కాగా తిరుమలరావును విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిపినట్లు తెలసింది.
ఎనిమిదేళ్లయిన పిల్లలు లేరని..
తిరుమల రావుకు పెళ్లయి 8 ఏళ్లయినా పిల్లలు లేరు. దీంతో తనను అందరూ అదోలా చూస్తున్నారని భావించాడు. ఆ క్రమంలోనే ఐశ్వర్య తల్లి సుజాత అదే బ్యాంక్లో పనిచేస్తుండంతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఇంటికి వస్తుండంతో సుజాత కూతురు ఐశ్వర్యపై తిరుమలరావు కన్నుపడింది. వారిద్దరి మధ్య కూడా సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భార్యను చంపేసి ప్రియురాలితో కాపురం చేసి పిల్లలను కనాలని తిరుమల రావు భావించాడు. అందుకు ఐశ్వర్య కూడా ఒప్పుకుంది. ఇలా ఏకకాలంలో తల్లీ కూతుళ్లతో తిరుమలరావు సంబంధం కొనసాగించాడు. అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డపేరు వస్తుందని భావించిన తిరుమలరావు ఐశ్వర్యతో మాత్రం అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. అయితే భార్య ఉండగా పెళ్లి సాధ్యం కాదు కనుక ఐశ్వర్య పెళ్లి చేసుకున్నా తమ సంబంధం కొనసాగించాలని భావించారు. కానీ, ఇద్దరి మధ్య సాగిన పోన్ సంభాషణతో తేజేశ్వర్ కు అనుమానం రావడం, ఐశ్వర్యను మందలించడంతో ఇక తమ వ్యవహరం కొనసాగదని భావించారు.
లడఖ్ వెళ్లేందుకు ప్లాన్..
అందుకే ఐశ్వర్య ప్రియుడు తిరుమలరావు తన భార్యను, ప్రియురాలి భర్త తేజేశ్వర్ను గుట్టుచప్పుడు కాకుండా హత్య చేసి.. ఆత్మహత్యలుగా చిత్రీకరించి లడఖ్ వెళ్లేందుకు టికెట్లు సిద్ధం చేసుకున్నారు. తేజేశ్వర్ హత్య కేసు సమసిపోగానే భార్యను కూడా హతమార్చి లడఖ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మే 17న ఐశ్వర్య భర్త తేజేశ్వర్ను పక్కా ప్లాన్తో చంపేశారు. ఆ తర్వాత మేనేజర్ తన భార్యను కూడా చంపి ఇద్దరు కలిసి లడఖ్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే మేనేజర్ భార్య హత్య నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కానీ, హత్య వ్యవహారం బయటకు రావడంతో కథ అడ్డం తిరిగింది.
బ్యాంక్ నుంచి రూ.25 లక్షల లోన్
తేజేశ్వర్ను చంపిన తర్వాత లడఖ్ వెళ్లాలని నిర్ణయించుకున్న తిరుమలరావు దానికోసం బ్యాంక్ నుంచి రూ.25 లక్షల లోన్ తీసుకున్నాడు. అందులో రూ.2 లక్షలు సుపారి గ్యాంగ్కు చెల్లించినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. లడఖ్ వెళ్లేందుకు హత్య జరిగిన రోజు తల్లికి ఫోన్ చేసి కొన్ని దుస్తులు తెప్పించుకుంది ఐశ్వర్య. ఈ కేసులో పోలీసులు 8మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా తిరుమల రావును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తిరుమలరావును ప్రశ్నిస్తున్న పోలీసులు, సుపారీ గ్యాంగ్తో మర్డర్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే పనిలో ఉన్నారు.
తండ్రి, సోదరుడిని కూడా చంపారా?
తేజేశ్వర్ మర్డర్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తల్లి విషయం తప్ప తండ్రి విషయం ఇంతవరకు వెలుగు చూడలేదు. తండ్రి గతంలోనే చనిపోయాడని కొందరు అంటుండగా భార్య ప్రవర్తన నచ్చక అతను ఇంటినుంచి వెళ్లిపోయాడని కొందరంటున్నారు.అదే సమయంలో ఐశ్వర్య సోదరుడిని కూడా చంపినట్లు ప్రచారం సాగుతోంది. ఆయన కొన్ని నెలల క్రితం ఇంట్లో జారిపడి మరణించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు అతను కిందపడి మరణించాడని ఐశ్వర్య, అతని తల్లి చుట్టుపక్కల వారికి చెప్పారు. అయితే తిరుమలరావుతో తన తల్లి, సోదరి ఐశ్వర్య సన్నిహితంగా ఉండటం నచ్చని అతను వారిద్దరిని వారించినట్లు తెలుస్తోంది. ఆ కోపంతో వారిద్దనే అతన్ని చంపి, ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించినట్లు తాజాగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
వారిద్దరూ వ్యభిచారులు...ఐశ్వర్య మేనత్త సంచలన వ్యాఖ్యలు
తేజేశ్వర్ హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఐశ్వర్య తండ్రిని ఆమె తల్లి కల్లులో మందుపెట్టి చంపేసిందని ఐశ్వర్య మేనత్త ఆరోపించింది. మా నాన్న వద్ద డబ్బులు ఉన్నంతవరకు మమ్మల్ని వాడుకొని తర్వాత కొట్టి తరిమేశారని ఆరోపించింది. ఐశ్వర్య తల్లి క్యారెక్టర్ బాగాలేదని తన తండ్రి వదిలేశాడని తెలిపింది. వారిద్దరినీ ఊర్లోకి రాణించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. వారు గ్రామంలో కొంతకాలంగా వ్యభిచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐశ్వర్యకు పెళ్లి అయిన విషయం ఇక్కడ ఎవరికీ తెలియదన్న ఆమె గతంలో ఆమె క్యారెక్టర్ బాగాలేదని పెళ్లి చెడిపోయిందని వివరించింది. ఆ తర్వాత తేజేశ్వర్ ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని చంపేసిందని ఆమె ఆరోపించింది.