/rtv/media/media_files/2025/06/13/zGzxT8NYmxKWVx7jrftv.jpg)
Google: అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద ఘటనపై ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా విమాన ప్రమాదంలో మరణించిన వారికి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) నివాళులర్పించింది. గూగుల్ వెబ్ సైట్ హోం పేజీలో బ్లాక్ రిబ్బన్ ను ఉంచి సంతాపం వ్యక్తం చేసింది. సెర్చ్ బార్ కింద నల్ల రిబన్ ఉంచి నివాళులు అర్పించింది. రిబ్బన్ పై కర్సర్ ఉంచినప్పుడు 'విషాదకరమైన విమాన ప్రమాదంలో మరణించిన వారి జ్ఞాపకార్థం' అనే సందేశం కనిపిస్తోంది.
Also Read: విజయ్ రూపానీ లేడంటే నమ్మలేకపోతున్నా.. మోదీ ఎమోషనల్ ట్వీట్!
కాగా నిన్న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒక్కరు మినహా మిగిలిన అందరూ మరణించారు. విమానం సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని 28 మంది మెడికోలు మృత్యువాత పడ్డారు.
Also Read: మరోసారి బెదిరింపులు.. పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న రాజాసింగ్!
విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి చేరుకుని గాయపడ్డ పలువురిని పరమార్శించారు.