Gautam Adani: కుంభమేళాలో కోటి భక్తి గీతాల పుస్తకాలు ఫ్రీగా అందజేసిన అదానీ గ్రూప్

పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కుంభమేళాలో తనవంతుగా సేవ చేస్తోంది. గీతా ప్రెస్ సంస్థతో కలిసి అదానీ గ్రూప్‌.. భక్తులకు ఉచితంగా కోటి భక్తి గీతాల పుస్తకాలను అందజేసింది. అలాగే ప్రతిరోజూ లక్ష మంది భక్తులకు ప్రసాదాన్ని అందిస్తోంది.

New Update
Gautam Adani

Gautam Adani

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసందే. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు అక్కడికి తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది తమవంతుగా సేవలు చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తనవంతుగా సేవలు అందిస్తున్నారు. గీతా ప్రెస్ సంస్థతో కలిసి అదానీ గ్రూప్‌.. కుంభమేళాకు వచ్చిన భక్తులకు ఉచితంగా కోటి భక్తి గీతాల పుస్తకాలను అందజేశారు.  

Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ హామీలు.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 1923లో గీతా ప్రెస్ సంస్థ ప్రారంభమైంది. సనాతన సాహిత్యం, పవిత్ర గ్రంథాలు, భక్తి పుస్తకాలను ప్రచూరించడంలో గీతా ప్రెస్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమధ్య కాలంలో మాత్రం దీని ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ క్రమంలోనే గౌతమ్‌ అదానీ ఈ సంస్థకు అండగా నిలిచారు. ఈ సంస్థ నుంచి ప్రచూరించిన ఈ భక్తి గీతాల పుస్తకాలనే భక్తులకు అందజేశారు. 

Also Read: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!

గీతా ప్రెస్‌తో కలిసి అదానీ గ్రూప్.. కోటి వరకు ఆర్తి సంగ్రహ - భక్తి గీతాల సంకలనం పుస్తకాలను ఉచితంగా అందించింది.  ఆధునిక వనరులకు సంప్రదాయ విలువలను జోడిస్తూ ఘనంగా వీటిని పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు భక్తులు కూడా అదానీ గ్రూప్, గీతా ప్రెస్ సంస్థలు చేపట్టిన కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే అదానీ గ్రూప్‌ భక్తి గీతాల పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు.. ఇస్కాన్ సంస్థతో కలిసి కుంభమేళాలో మహాప్రసాద సేవ చేస్తోంది. ప్రతిరోజూ దాదాపు లక్షకు పైగా భక్తులకు ప్రసాదాన్ని అందిస్తోంది.   

Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

Also Read: ఐసీసీ సీఈవో రాజీనామా.. పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడమే కారణమా?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు