A-171 Horror: భార్యను కలవడానికి వెళ్తూ..తిరిగి రాని లోకాలకు గుజరాత్ మాజీ సీఎం రూపానీ

అహ్మదాబాద్ విమానం ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో మొత్తం 265 మంది మృతి చెందారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు.

New Update
flight

Gujarath Former CM Vijay Rupani

అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఎంతో మంది కుటుంబాలలో కననీటిని నింపింది. ప్రయాణిలుకు, పైలెట్లు, సిబ్బంది తో పాటూ మెడికల్ కాలేజీ విద్యార్థులు మరికొందరు కూడా ఈ ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలింది. ఇందులో మొత్తం 242 ప్యాసెంజర్స్ ఉన్నారు.వీరిలో ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించారు. మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. రూపానీ 2016 ఆగస్టు నుంచీ 2021 సెప్టెంబర్ వరకు గుజరాత్ సీఎంగా పని చేశారు. 

Also Read :  జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

భార్యను తీసుకురావడానికి వెళ్తూ..

మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ భార్య అంజలీబెన్ ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడ తన కుమార్తె దగ్గర ఆమె ఆరునెలలుగా ఉంటున్నారు. అంజలీబెన్ ను లండన్ నుంచి తీసుకురావడానికే రూపానీ బయలుదేరారు. విజయ్ రూపానీకు ఇద్దరు కుమార్తెలున్నట్టు తెలుస్తోంది. రూపానీ బిజినెస్ క్లాస్ విభాగంలో 2-Dలో కూర్చున్నారని విమాన రికార్డులు నిర్ధారించాయి. ఆయన విమానంలో కూర్చుని ఉండగా మరో ప్రయాణికురాలు ఫోటో కూడా తీసింది. రూపానీ మరణంతో ఆయన స్వస్థలమైన రాజ్ కోట్ , బీజేపీలో విషాద ఛాయలు అలముకున్నాయి.  పలువురు బీజేపీ నేతలు ఆయన మరణానికి ధిగ్భ్రాంతిని తెలియజేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ లు కూడా పెట్టారు.  

Also Read :  ‘రాజాసాబ్‌’ టీజర్‌ లీక్‌.. ప్రభాస్‌ లుక్ చూస్తే!

Also Read :  ఈ 4 గాడ్జెట్‌లను విమానంలో తీసుకెళ్తే చాలా డేంజర్.. ప్రాణాలే పోతాయ్!

 

Also Read: Israel-Iran: నిజమైన ట్రంప్ హెచ్చరిక..ఇరాన్ పై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్

 

ex-cm | today-latest-news-in-telugu | Ahmedabad-London flight crash

Advertisment
Advertisment
తాజా కథనాలు