Israel-Iran: నిజమైన ట్రంప్ హెచ్చరిక..ఇరాన్ పై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినదే నిజమౌతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ లోని ఈశాన్య ప్రాంతంలో పేలుళ్ళ శబ్దాలు వినిపంచాయని చెబుతున్నారు. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయని తెలుస్తోంది.

New Update
idf

Israel Attack On Iran

ఇరాన్ పై ఇజ్రాయెల్ ముందస్తు దాడులను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టుగానే ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తోంది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని శుక్రవారం ఉదయం పేలుళ్ళు వినిపించాయని చెబుతున్నారు.  డజన్ల కొద్దీ దాడులు జరిగాయని తెలుస్తోంది. వీటి తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేసింది. దాంతో పాటూ ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్ దేశాలు తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Also Read :  ఓరెయ్ కామాంధుల్లారా.. తెలంగాణలో 90 ఏళ్ల వృద్ధురాలిపై రేప్

Also Read :  మూడు రోజుల ముందే ప్లాన్ లీక్.. ప్లైట్ క్రాష్‌ కుట్ర పన్నిన ఆల్‌ఖైదా..?

ఇజ్రాయెల్ లో అత్యవసర పరిస్థితి..

మరోవైపు ఇజ్రాయెల్ లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశంలో దాడులు జరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇరాన్ లో తాము దాడులు నిర్వహించామని..దీని కారణంగా ఇజ్రాయెల్లో కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరగవచ్చని ఆయన అన్నారు. ఇక ఇరాన్‌పై దాడులు చేయడంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని, ఈ ఆపరేషన్‌లో అమెరికా ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేసారు. ఈ ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడం తమ పరిపాలన యొక్క అగ్ర ప్రాధాన్యత అని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా ప్రయోజనాలను లేదా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోకూడదని మార్క్ అన్నారు. 

Also Read: Flight Accident: A- 171 విమాన ప్రమాదానికి గల ఐదు కారణాలు

Also Read :  తండ్రి కోసం ఉద్యోగాన్ని వదిలేయాలనుకున్నాడు...కానీ ఏకంగా ప్రాణాలే..

today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు