/rtv/media/media_files/2025/06/09/olumgdMNCx8OTHDu57Nb.jpeg)
జర్నలిస్ట్ కొమ్మనేనిని సుప్రీంకోర్టులో ఉరట లభించింది. కొమ్మనేనికి సుప్రీకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాస్కు సంబంధం లేదని ఉన్నత న్యాయస్తానం తేల్చి చెప్పింది. కొమ్మినేని శ్రీనివాస్ రావుని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 70ఏళ్లు ఉన్న వ్యక్తిని అలా ఎలా అరెస్ట్ చేస్తారని సుప్రీం కోర్టు పోలీసులను ప్రశ్నించింది.
Supreme Court grants bail to Srinivasa Rao, a senior journalist and anchor on Sakshi TV, who was arrested on June 9 after moderating a talk show in which a guest allegedly made derogatory remarks about women from Amaravati, referring to the region as a “capital of prostitutes”… pic.twitter.com/puYyO5drqx
— Bar and Bench (@barandbench) June 13, 2025
‘అమరావతి దేవతల రాజధాని కాదు. వేశ్యల రాజధాని.’ అంటూ సాక్షి చానల్ చర్చలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
#YCPinsultsWomen
— Lokesh Nara (@naralokesh) June 7, 2025
మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం@ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే… pic.twitter.com/d4Pvmqy2AE
అమరావతి మహిళలను అమవానించారంటూ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, వీవీఆర్ కృష్ణంరాజు, సాక్షి టీపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయగా.. మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 11 కృష్ణం రాజు కూడా అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాస్ రావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆక్రమంలో ఆ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాస్ రావును విడుదల చేశాని పోలీసులను ఆదేశించింది.