Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ తో వివాదాలు కోరుకోవడం లేదు : సీఎం రేవంత్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బనకచర్లపై  ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.  

New Update
Telangana CM Revanth Reddy

Telangana CM Revanth Reddy

Revanth Reddy : ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బనకచర్లపై  ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదన్నారు. అదే సమయంలో ఎవరి కోసమో మా హక్కులను వదులుకోమని తేల్చి చెప్పారు. చర్చల ద్వారానే పరిష్కారమని తెలంగాణ విశ్వసిస్తుందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రావద్దనే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు.

Also Read :  ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్‌ మీడియాలో దృశ్యాలు వైరల్‌

ఈ ప్రాజెక్టు విషయంలో కూర్చుని మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ వివాదం ఉండేది కాదన్నారు. కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో ఏపీ చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు.23న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉందన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్ర క్యాబినెట్లో బనకచర్ల అంశంపై చర్చిస్తామని వివరించారు.

Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!

అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలకు మేమే ఒక అడుగు ముందుకు వేస్తాం అని రేవంత్‌ అన్నారు.ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే... మొదట తెలంగాణకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రాజెక్టుల అనుమతుల కోసం కేంద్రం వద్దకు వెళ్తుందని ఆరోపించారు. కేంద్రం సైతం ఆంధ్ర ప్రదేశ్ నిర్మించనున్న ప్రాజెక్టులపై సమావేశాలు నిర్వహిస్తుందని దానివల్ల తెలంగాణ ఆందోళన చెందాల్సి వస్తుందన్నారు.   ఏపీని బనకచర్లపై చర్చలకు ఆహ్వానిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబును తానే స్వయంగా మీటింగ్ కు ఆహ్వానిస్తానన్నారు.

Also Read :  జగన్ రప్పా.. రప్పా.. డైలాగ్ కు పవన్ కౌంటర్.. ఏమన్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు