/rtv/media/media_files/2025/01/05/MCKXtPFnbuNLJAaD1jgp.jpg)
Mahakumbh Mela
Kumbh Mela: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. వైభవంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Telangana: రేపటి నుంచి వారి ఖాతాల్లో డబ్బులు.. డిప్యూటీ సీఎం భట్టి అదిరిపోయే శుభవార్త!
రష్యా,ఉక్రెయిన్ సహా అమెరికా, జపాన్, జర్మనీ,నెదర్లాండ్, కామెరూన్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోలాండ్, బొలీవీయా ఇలా 73 దేశాల దౌత్యవేత్తలు తొలిసారి ఇక్కడికి రానున్నారు. ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి విదేశాంగ మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ప్రయాగ్రాజ్కు చేరుకున్న అనంతరం దౌత్యవేత్తలు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు.అనంతరం అక్షయావత్,బడేహనూమాన్ ఆలయాన్నిసందర్శిస్తారు. కాగా..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మికవేడుక మహా కుంభమేళాతో ప్రయాగ్రాజ్ కళకళలాడుతోంది.
జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు జరగనుంది.విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పోటేత్తారు.ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ కార్యక్రమం 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు సృష్టించింది. తాత్కాలిక వైద్య శిబిరాలతో 1.5 లక్షల మంది నర్సులు,పారామెడిక్స్ ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు లభించాయి.