Operation Sindhu: ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 290 మంది భారతీయులు

ఆపరేషన్ సింధూలో భాగంగా ఇరాన్ నుంచి రెండో విమానం భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చింది. తుర్క్మెనిస్తాన్‌లోని అష్గాబాత్ నుంచి 290 మంది విద్యార్థులు శనివారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. 2 రోజుల క్రితం 110 మందిని తీసుకొచ్చారు.

New Update
Indian students from Iran

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా అక్కడున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి రప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ఆపరేషన్ సింధూ ప్రారంభించింది. తుర్క్మెనిస్తాన్‌లోని అష్గాబాత్ నుంచి 290 మంది భారతీయులతో విమానం శనివారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. టెహ్రాన్ తన వైమానిక ప్రాంతాన్ని శుక్రవారం రాత్రి తెరిచిన తర్వాత, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ చెందిన 290 మంది ఇండియన్ స్టూడెంట్స్‌తో కూడిన విమానం ఇరాన్‌లోని మషద్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

రెండు రోజుల క్రితం 110 మందిని ఇండియాకు తీసుకొచ్చారు. ఇరాన్‌ నుంచి మొదటి విమానం బుధవారం రాత్రి భారత్‌కు చేరుకుంది.  అర్మెనియా నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో 110 మంది వలస భారతీయులు సురక్షితంగా ఇండియా చేరుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు