Crime News: ఢిల్లీ సాకేత్ కోర్టులో ఖైదీల మధ్య ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం

ఢిల్లీలోని సాకేత్ కోర్టులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైదీల మధ్య వ్యక్తిగత వైరం తీవ్ర స్థాయికి చేరి.. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో అమన్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తికి తీవ్రగా గాయాపడ్డాడు.

New Update
Delhi Saket court

Delhi Saket court

Crime News: ఢిల్లీ నగరంలోని సాకేత్ కోర్టులో దారుణ ఘటన చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం కోర్టులో హాజరైన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైదీల మధ్య వ్యక్తిగత వైరం తీవ్ర స్థాయికి చేరి.. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో అమన్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఖైదీపై తీవ్రంగా దాడి చేశాడు. కోర్టు ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ హాజరైన పోలీసులు, న్యాయవాదులు, ఇతర సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఖైదీ పారిపోవడానికి యత్నించగా...

ఈ దాడి జరిగిన సమయంలో పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అమన్‌ను దాడి చేసిన ఖైదీ పారిపోవడానికి యత్నించగా పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఖైదీ మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ కాల్పుల్లో ఇద్దరు ఖైదీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  



ఇది కూడా చదవండి: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొని తండ్రీ కొడుకులు మృతి

పోలీసుల తక్షణ స్పందన లేకపోతే ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉండేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి  ఖైదీల మధ్య ఉన్న వైరం, దాడికి కారణమైన అంశాలను లోతుగా గమనించి చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇకపై విచారణ నిమిత్తం ఖైదీలను కోర్టులకు తీసుకొస్తున్న సమయంలో భద్రత మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: మీరు డయాబెటిస్‌ను చెక్ పెట్టాలనుకుంటున్నారా? ఈ పద్ధతులు మీకు సహాయపడతాయి

( Latest News | delhi | delhi-court | firing)

Advertisment
Advertisment
తాజా కథనాలు