/rtv/media/media_files/2025/06/05/noVMkdRYrWlWB6a29D9S.jpg)
khammaam crime news
Crime News: ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిల్చున్న ద్విచక్ర వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన తండ్రీ కొడుకులు అజ్మీరా బాల్యా (45), సాయికుమార్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. వారిద్దరూ చదువుల కోసం ఖమ్మం వచ్చినట్లు సమాచారం. అజ్మీరా బాల్యా తన కుమారుడిని ఖమ్మం జూనియర్ కాలేజీలో చేర్పించేందుకు తీసుకురాగా.. తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ సంఘటన ఖమ్మం నగరంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అతి వేగంతో ఇద్దరు మృతి:
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ద్విచక్ర వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అయితే.. లారీ డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ను ఉల్లంఘించి అతి వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోనే తండ్రీకొడుకులు మృతి చెందడంతో అక్కడి చూసిన వారు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి.. రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగలోకి దిగి వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
ఇది కూడా చదవండి: ఇవి ఇన్స్టాంట్ బూస్టర్లు.. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేసుకున్నారు. అనంతరం సహాయ చర్యలు చెపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉండగా.. అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబంలో ఇద్దరిని ఒక్కసారిగా కోల్పోవటంతో అజ్మీరా బాల్యా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!
( ts-crime | ts-crime-news | Latest News)