Kejriwal: కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ నేతల కుట్ర.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్లాన్!

అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేజ్రీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

New Update
delhi cm

Delhi CM Atishi accused BJP leaders of planning to kill Kejriwal

Delhi: అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఇందులో భాగంగానే కేజ్రీవాల్‌పై వరుస దాడులు చేస్తున్నారని, హరినగర్‌లో రాళ్లు, కర్రలతో కొట్టారని చెప్పారు. ఇందంతా కళ్లముందు జరుగుతున్న ఢిల్లీ పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తూ ఊరుకున్నారని, కనీసం అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించలేదని మండిపడ్డారు. 

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు.. 

కేజ్రీవాల్ దాడిలో ఇద్దరి ప్రమేయం ఉంది. ఒకరు బీజేపీ కార్యకర్త, మరొకరు ఢిల్లీ పోలీసులు. బీజేపీ కార్యకర్త దాడి చేసినట్లు తేలడంతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఈ దాడులపై ఎన్నికల కమిషన్ ఆడిట్ నివేదిక ఇవ్వాల్సిందే. అరవింద్ కేజ్రీవాల్‌ అడ్డుతొలగించుకోవడమే బీజేపీ ఏకైక లక్ష్యం. ఎలాంటి హింస జరగలేదని తప్పుడు ప్రకటనలపై సంతకం చేయాలంటూ ఆప్ వాలంటీర్లను పోలీసులు బెదిరించారు. నిందితులైన పోలీసులను ట్రాన్స్ ఫర్ చేయాలి. కొంతమంది అధికారులు బీజేపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

ఇది కూడా చదవండి: Maoist: ఈ నేలపై నక్సలిజం చావదు.. ప్రభుత్వాలవి నీటిపై రాతలే: RTVతో పౌరహక్కుల నేత!

ఇక ఎస్‌హెచ్‌ఓ ధరమ్‌వీర్, ఇన్‌స్పెక్టర్ సుశీల్ శర్మ, కానిస్టేబుల్ జై భగవాన్ ఈ దాడిలో పాల్గొన్నట్లు ఆమె ఆరోపించారు. ఆప్ వాలంటీర్‌లను సంప్రదించి కుట్రకు ప్లాన్ చేసినట్లు తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. తాము పెట్టిన కేసులను మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!

Advertisment
Advertisment
తాజా కథనాలు