MEGHA Fraud: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!

మేఘా సంస్థ కమిషన్లు ఇచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడుతోందని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. ఆ సంస్థ ఓనర్ కృష్ణారెడ్డి అతిపెద్ద అవినీతిపరుడని ఆరోపించారు. వెంటనే మేఘాను తెలంగాణలో బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు.

New Update

లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతూ ప్రజా సంపదను దోచుకుంటున్న మేఘా కంపెనీని బ్యాన్ చేయాలని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. RTVతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. మేఘా కంపెనీ కమిషన్లు ఇచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడుతోందన్నారు. ఆ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి అతిపెద్ద అవినీతి పరుడని ధ్వజమెత్తారు.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేకనే పోస్టర్లు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన పోస్టర్ల వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. తాను బలపడితే వారిద్దరికీ అక్కడ రాజకీయ మనుగడ ఉండదనే కుట్రతోనే పోస్టర్లు వేస్తున్నారని ఆరోపించారు.

సొంత డబ్బులతో ఇళ్లు ఇస్తా..

ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వకుంటే తన సొంత నిధులతో ఇల్లు నిర్మిస్తానని ప్రకటించారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఆర్మూర్ నియోజకవర్గానికి సరిపడా ఇళ్లులు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ ఆర్మూర్ కు ప్రభుత్వం ఇళ్లు కేటాయించకపోతే.. ఇక్కడి ప్రజలు కట్టే ట్యాక్స్ లను వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడు తాము ఆర్మూర్ ను ప్రత్యేకంగా పాలించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాకేష్‌ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు