Defence Ministry: ఈ ఏడాది సంస్కరణల సంవత్సరం.. రక్షణశాఖ కీలక ప్రకటన

కొత్త సంవత్సరం వేళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 2025ను సంస్కరణల సంవత్సరంగా ప్రకటించారు. ఈ ఏడాది సాయుధ దళాలకు కీలకమైన ముందడుగని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Rajnath singh

Rajnath singh

భారత రక్షణ దళం మరింత విస్తరించనుంది. సమీకృత థియేటర్ కమాండ్లను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. కొత్త సంవత్సరం వేళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో బుధవారం కీలక మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కీలక ప్రాజెక్టులు, సంస్కరణలు, ఇతర అంశాల పురోగతికి సంబంధించి చర్చలు జరిపారు. ఇండియన్ ఆర్మీని.. వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహించగల టెక్‌ ఫోర్స్‌గా మార్చేందుకు కృషి చేయనున్నారు.

Also Read: Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!

 దేశంలో కృత్రిమ మేధ(AI), అంతరిక్షం, సైబర్, మెషిన్ లెర్నింగ్, హైపర్ సోనిక్ రోబోటిక్స్‌ రంగాలపై సంస్కరణలు చేయాలని ఈ సమావేశంలో రక్షణశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆపరేషన్ల అవసరాలకు తగ్గట్లు దళాల మధ్య సమన్వయం కుదిరేలా, మరింత సహకారం పెంచేలా టార్గెట్ పెట్టుకుంది. అవసరాలకు తగ్గట్లు వీటిని సమకూర్చడం, అభివృద్ధి చేసేదుకు ఆయుధాల కొనుగోళ్ల విధానాన్ని సరళీకరించాలని నిర్ణయించింది. 

Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

ఈ సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2025ను సంస్కరణల సంవత్సరంగా ప్రకటించారు. ఈ ఏడాది సాయుధ దళాలకు కీలకమైన ముందడుగని అభివర్ణించారు. దేశ రక్షణ సన్నద్ధతలో ఈ చర్యలు ఊహించని ముందడుగుకు పునాదిగా మారుతాయని పేర్కొన్నారు. 

Also Read: Ap Govt: ఏపీలో పలువురు ఐఏఎస్‌,ఐపీఎస్‌ లకు పదోన్నతులు!

Also Read: కొత్త సంవత్సరం మొదటి రోజే..తల్లి,నలుగురు చెల్లెళ్లను చంపేసిన కిరాతకుడు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు