/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/infosys-jpg.webp)
Infosys: ప్రముఖ సాఫ్ట్​ వేర్​ సంస్థ ఇన్ఫోసిస్..తన బెంగళూరు బ్రాంచ్​ఉద్యోగులకు వార్నింగ్​ మెయిల్స్​ పంపించింది. మీరు ఆఫీసుకు రావొద్దు.. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయండి. మళ్లీ మేము మీకు తిరిగి రండి అనే మెయిల్స్ పంపే వరకు రావద్దని, ఈ రూల్స్ ని అందరూ పాటించాలని..కాదు కూడదని మీరు ఆఫీసుకు వస్తే మీరే ప్రమాదంలో పడతారంటూ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Crime: న్యూ ఇయర్ వేడుకలకు పిలిచి గొంతు కోసి చంపేశారు!
స్వయంగా హెఆర్​ డిపార్టుమెంటే ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది.. ఇంతకీ ఇన్ఫోసిస్​ ఎందుకు ఉద్యోగులకు అలా మెయిల్స్ పంపించిందంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.ఇన్ఫోసిస్​ మైసూరు క్యాంపస్​ లో అనుకోని అతిథులు తిరుగుతున్నారు. దీంతో డిసెంబర్​ 31న ఉద్యోగులందరూ ఇంటివద్ద నుంచే వర్క్ కంపెనీ హెచ్​ఆర్​ డిపార్టుమెంట్​ మెయిల్స్​ ఉద్యోగులకు పంపింది.
Also Read: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!
హెబ్బాల్​ ఇండస్ట్రియల్​ ఏరియాలో ఉన్న మైసూరు ఇన్ఫోసిస్​ క్యాంపస్​ రిజర్వ్​ ఫారెస్ట్​ కు దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం చిరుతపులులకు నిలయం.. అప్పుడప్పుడు క్యాంపస్​ ఆవరణలో కూడా కనపడుతుండేవి. రెండూ మూడు రోజులుగా క్యాంపస్​ ఆవరణలో తిరుగుతుండటంతో ఉద్యోగులకు భయం పట్టుకుంది.
Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
మైసూర్ ఇన్ఫోసిస్​ లో చిరుతపులి సంచారం కొత్తేమి కాదు.. గతంలో కూడా ఓసారి క్యాంపస్ ఆవరణలోకి వచ్చి హల్​ చల్​ చేసింది. 2011లో ఓ సారి క్యాంపస్ లోకి రావడంతో ఉద్యోగులు సిబ్బంది భయంతో పరుగులు పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు మరోసారి క్యాంపస్​ ఆవరణలో కనిపించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Also Read: Ap Govt: ఏపీలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు!
ఉద్యోగుల భద్రత కోసం... వారికి వర్క్​ ఫ్రం హోం ప్రకటించడమే కాకుండా.. క్యాంపస్​ ఆవరణలోకి చిరుత రాకుండా అటు అటవీశాఖ, ఇటు టాస్క్​ ఫోర్స్​ సిబ్బందితో ముందస్తుగా భద్రత చర్యలు చేపట్టింది.