కొత్త సంవత్సరం మొదటి రోజే దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లకు విషం పెట్టి చంపేశాడు.ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాలతోనే నిందితుడు.. ఐదుగుర్ని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆగ్రాకు చెందిన అర్షద్ (24) తన తల్లి అస్మా, నలుగురు చెల్లెళ్లు అలీషా (19), రహ్మీన్ (18), అక్సా (16), అలియాలు తినే ఆహారంలో విషం కలిపి, తర్వాత చేతి మణికట్టుపై కత్తితో కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు.
Also Read: Infosys: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!
నకా ప్రాంతంలోని హోటల్ శరణ్జిత్లో బాధిత కుటుంబం డిసెంబరు 30న దిగినట్టు వివరించారు. తల్లి సహా ఐదుగుర్ని హత్యచేసిన అర్షద్.. అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. లక్నో డీసీసీ రవీనా త్యాగి మాట్లాడుతూ.. ‘నిందితుడ్ని అర్షద్ (24) గా గుర్తించారు.. కుటుంబంలోని ఐదుగుర్ని హత్య చేశాడు.. అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడిన నిందితుడ్ని స్థానిక పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు’ అని చెప్పారు. ఘటనా స్థలికి ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని.. ఆధారాలు సేకరిస్తున్నారని వివరించారు. ఘటనపై కేసు నమోదుచేసి లోతుగా దర్యాప్తు చేపట్టామని వివరించారు.
Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
కుటుంబ గొడవలతోనే ఈ హత్యలు చేసినట్టు ప్రాథమిక విచారణలో నిందితుడు చెప్పాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం తరలించినట్టు పోలీసులు వివరించారు. ఈ హత్యల్లో అర్షద్ తండ్రి బాబర్ పాత్ర కూడా ఉండే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని పోలీస్ అధికారులు వివరించారు. ఘటనా స్థలిలో బాబర్ ఉన్నాడా? లేడా? అనేది స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఐదుగురి హత్యలకు ముందు నిందితుడు, బాధితులకు మధ్య పెద్ద గొడవే జరిగినట్టు తెలుస్తోంది.
Also Read: Ap Govt: ఏపీలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు!
అయితే,ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. వీరంతా కలిసి ఆగ్రా నుంచి లక్నోకు ఎందుకు వచ్చినట్టు? అక్కడ ఏం జరిగింది? రెండు రోజుల నుంచి హోటల్లో ఎందుకు ఉన్నారు? అనేది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తెలియనుంది.