/rtv/media/media_files/2025/10/05/telangana-2025-10-05-10-37-04.jpg)
వాహనదారులకు కేంద్రం బిగ్షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ రూల్స్(traffic-rules) మరింత కఠినతరం చేసింది. కొత్త ట్రాఫిక్ రూల్స్ ముసాయిదాను విడుదల చేసింది కేంద్ర రవాణా శాఖ. ఒక వాహనంపై ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు(traffic-challans) పెండింగ్లో ఉన్నట్లయితే, సంబంధిత రవాణా అధికారులు ఆ డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయవచ్చు. చలాన్(e-challans) చెల్లించడానికి ఉన్న గడువును ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుండి 45 రోజులకు తగ్గించారు. 45 రోజుల్లోగా చలాన్ చెల్లించకపోతే, అధికారులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది.
ఐదుకు మించి చలాన్లు ఉంటే ఇకపై వాహనదారుడి లైసెన్స్ రద్దుకు అవకాశం.
— Telugu Stride (@TeluguStride) October 5, 2025
మోటారు వెహికల్స్ రూల్స్-1989లో కీలక సవరణలు ప్రతిపాదించిన కేంద్రం. 45 రోజుల్లోగా చలాన్ కట్టకుంటే వాహనాన్ని సీజ్ చేసుకోవచ్చని నిబంధన. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ల నిబంధన 45 రోజులకు తగ్గింపు. చలాన్లను ఆలస్యం చేస్తే… pic.twitter.com/m0Pqq0y6Tm
Also Read: Rohit Sharma : ముందే ఊహించాడు.. 13 ఏళ్ల కిందే చెప్పేశాడు... రోహిత్ పాత ట్వీట్ వైరల్!
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే
45 రోజుల్లో చలాన్లు చెల్లించకుంటే వాహనంపై అన్ని రకాల లావాదేవీలు క్లోజ్ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే 3 రోజుల్లో ఎలక్ట్రానిక్ చలాన్ జారీ చేయనున్నారు పోలీసులు. సాధారణంగా చలాన్లు వాహన యజమాని పేరు మీదే జారీ అవుతాయి. అయితే, చలాన్ జారీ అయిన సమయంలో వాహనాన్ని యజమాని నడపలేదని నిరూపించినట్లయితే, ఆ సమయంలో వాహనం నడిపిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు. ఈ కఠిన నిబంధనలు రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించేలా చేయడానికే జారీ చేశారు.
Also Read : BREAKING: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండింగ్లో తెరుచుకున్న ఎమర్జెన్సీ ఇంజన్
ఐదుకు మించి చలాన్లు ఉంటే ఇకపై వాహనదారుడి లైసెన్స్ రద్దుకు అవకాశం.
— Yash (@Yash4Indiaa) October 5, 2025
మోటారు వెహికల్స్ రూల్స్-1989లో కీలక సవరణలు ప్రతిపాదించిన కేంద్రం.
45 రోజుల్లోగా చలాన్ కట్టకుంటే వాహనాన్ని సీజ్ చేసుకోవచ్చని నిబంధన.
ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ల నిబంధన 45 రోజులకు తగ్గింపు.
చలాన్లను… pic.twitter.com/Zr4oQRwX3Y
కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే దిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. [email protected] కు ఈ-మెయిల్ కూడా చేయొచ్చని స్పష్టం చేసింది. కాగా తెలంగాణలో జరుగుతున్న అధికశాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగంగా డ్రైవ్​ చేయడమనేది ఓ ప్రధాన కారణమని తేలింది. స్పీడ్​ లిమిట్​నిర్దేశించినప్పటికీ చాలామంది వాహనం నడిపే వారు వాటిని పాటించట్లేదు. గత ఏడాది ఏకంగా 11.31 లక్షల ఓవర్​ స్పీడ్​ కేసులు నమోదయ్యాయి. 25 వేల 971 మంది అన్నిరకాల రోడ్డు ప్రమాదాల్లో బాధితులు అయ్యారు.
Also Read : Pak occupied Kashmir: POKతో డీల్ కుదుర్చుకున్న పాకిస్తాన్.. రాత్రికి రాత్రే వాళ్లతో సంతకాలు!