CBSE Board Class 12 Result 2025: CBSE 10, 12వ తరగతి ఫలితాలు విడుదల - ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు cbse.gov.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేయవచ్చు. మొత్తం 88.39% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా విజయవాడ నుండి 99.6% మంది ఉత్తీర్ణులయ్యారు.

New Update
CBSE Board 10th and 12th Result 2025 out

CBSE Board 10th and 12th Result 2025 out

CBSE Board Class 12 Result 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు 2025 వెల్లడయ్యాయి. విద్యార్థులు cbse.gov.inలో తమ ఫలితాలను చెక్ చేయవచ్చు. ఫలితాలను తనిఖీ చేయడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ID, పుట్టిన తేదీ, 6 అంకెల డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ (పాఠశాలల ద్వారా షేర్ చేసుకుంది)తో చెక్ చేసుకోవాలి. అయితే CBSE 10వ తరగతి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈరోజు అంటే మరికొద్ది గంటల్లో ప్రకటించే అవకాశం ఉంది. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

ఈ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. -- https://cbseresults.nic.in/

మొత్తం 88.39% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా విజయవాడ నుండి 99.6% మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యల్పంగా ప్రయాగ్‌రాజ్ నుండి - 79.5% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 18, 2025 వరకు జరిగాయి. అలాగే 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4, 2025న ముగిశాయి. ఈ సంవత్సరం మొత్తం 42 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అందులో 10వ తరగతి నుండి 24.12 లక్షలు మంది. 12వ తరగతి నుండి 17.88 లక్షలు మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. 

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?

telugu-news | latest-telugu-news | cbse-board-exams | cbse-board-10th | cbse-board

Advertisment
Advertisment
తాజా కథనాలు