Mayavati: కుల వివక్షతోనే దళిత ఐపీఎస్ ఆత్మహత్య.. మాయావతి

హర్యానాలో సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసున్న ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

New Update
bsp chief mayawati responds on Dalit ips officer Suicide

bsp chief mayawati responds on Dalit ips officer Suicide


హర్యానాలో సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసున్న ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. '' దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలపై కుల వివక్ష, వేధింపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సంఘటనతో ఇవి జరుగుతున్నాయని మరోసారి రుజువైంది. ఈ విషాద ఘటనపై దేశంలోని దళితుల్లో ఆందోళన, ఆవేదన, నిరాశ నెలకొంది. 

Also Read: రాహుల్ గాంధీకి పట్టిన గతే తేజస్వీకి పడుతుంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

పాలనా వ్యవస్థలో కులతత్వం ఎలా పాతుకుపోయిందో.. అధిపత్య పాలకులు, ప్రభుత్వాలు, అధికార యంత్రాగం ఇలాంటి వాటిని అడ్డుకోవడంలో ఎలా విఫలమవుతున్నాయో రుజువు చేస్తుంది. ఈ ఘటనపై CBIతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికే కుల వివక్షపై ఆరోపణలు బయటపడుతున్నాయి. అందుకే దర్యాప్తును పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా జరపాలి. కేంద్రం, సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనను సామాజిక న్యాయం కోణంలో చూడాలి. ఈ కేసును అత్యంత సీరియస్‌గా పరిగణించాలి. 

Also Read: ట్రంప్ మరో టారీఫ్ బాంబ్..   చైనా దిగుమతులపై 100% సుంకాలు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ఎల్లప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేసే ఆధిపత్య వర్గాల వాళ్లు ఆ ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే బహుజన, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్లు విద్య, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినా, రాజకీయంగా ఉన్నత పదవులు చేపట్టినా వాళ్లందరినీ కులం ఎప్పటికీ వెంటాడుతుంది. కులం పేరుతో దౌర్జన్యాలు, అణిచివేత అనేది ఈ వర్గాలపై అన్ని స్థాయిల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనతో ఇది రుజువైందని'' మాయావతి అన్నారు. 

Also Read: విద్యార్థికి ఘోర అవమానం.. ఫీజు చెల్లించలేదని నేలపై కూర్చోబెట్టి పరీక్షలు

Advertisment
తాజా కథనాలు