/rtv/media/media_files/2025/05/28/E9C7Uqk0uL1G9wXFdYyU.jpg)
Gali Janardhan Reddy : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనను హైదరాబాద్ చంచల్గూడ జైల్లో ఉంచిన విషయం కూడా తెలిసిందే. కాగా, కర్ణాటక రాష్ట్రంలోను గాలి జనార్ధన్ రెడ్డిపై అనేక అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను విచారించేందుకు అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్తో బెంగళూరు పోలీసులు చంచల్గూడ జైలు నుంచి గాలి జనార్దనరెడ్డిని బెంగళూరుకు తరలించారు. గాలి జనార్దనరెడ్డితో పాటు అతని సహాయకుడు మెహఫుజ్ అలీఖాన్ ను కూడా బెంగళూరుకు తరలించారు.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
ఈ మేరకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో గాలి జనార్ధన్ రెడ్డిపై ఉన్న కేసుల విషయమై అక్కడి పోలీసులు చంచల్ గూడ జైలు అధికారులను సంప్రదించారు. బెంగళూరు పోలీసులు అక్కడి కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్తో చంచల్గూడ జైలు అధికారులను కలిశారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం గాలి జనార్దనరెడ్డిని తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
గాలి జనార్ధన్ రెడ్డిపై గనుల తవ్వకాల నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన కొందరు గతంలో బెంగళూరులోని చట్టసభల ప్రతినిధుల కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణలో భాగంగా నిందితులను వ్యక్తిగతంగా హాజరుపర్చాలని న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ ఇదివరకే ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు బెంగళూరు పోలీసులు చంచల్గూడ జైలు నుంచి వారిని తీసుకొచ్చి బెంగళూరులోని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానంలో హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులకు రిమాండ్ విధించడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా పడింది.
Also Read: అనిరుధ్కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!