Bengaluru stampede : బెంగళూరు తొక్కిసలాట... కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు

బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ  కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.

New Update
Bengaluru stampede

Bengaluru stampede

Bengaluru stampede :  బెంగళూరు తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకుంది. గురువారం అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ  కమిషనర్ సహా ఐదుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఐపీఎల్‌ ట్రోపీలో ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో విజయోత్సవాలు నిర్వహించే క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

ఈ దుర్ఘటనపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి. దయానంద, డీసీపీ (సెంట్రల్ డివిజన్) హెచ్.టి. శేఖర్‌తో సహా ఐదుగురు సీనియర్ పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు  ప్రకటించారు. మరోవైపు తొక్కిసలాటకు గల కారణాలను విచారించేందుకు కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

విధానసౌధలో నిర్వహించిన అత్యవసర మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ పలు సంచలన అంశాలను వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. "కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ (గిరీష్ ఎ.కె.), ఆ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) (బాలకృష్ణ), సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) (హెచ్.టి. శేఖర్), స్టేడియం భద్రతకు బాధ్యత వహించిన అదనపు పోలీస్ కమిషనర్, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ (బి. దయానంద)లను వెంటనే విధులనుండి సస్పెండ్ చేయాలని నిర్ణయించాం" అని పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: Operation Kagar : చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రం లో మరో భారీ ఎన్ కౌంటర్...అగ్రనేత మృతి ?

కాగా ఈ విషాద ఘటనకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, మంత్రులు హెచ్.కె. పాటిల్, ఎం.సి. సుధాకర్, హెచ్.సి. మహదేవప్పలతో పాటు సీఐడీ అధికారులతో  సమావేశమయ్యామన్నారు. ఘటనకు గల కారణాలపై చర్చించిన అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నామని సీఎం వివరించారు. "ప్రాథమికంగా ఈ అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించాయి. అందుకే వారిని సస్పెండ్ చేయాలని నిర్ణయించాం" అని ఆయన స్పష్టం చేశారు. ఆర్సీబీ జట్టు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా జరిగిన విజయోత్సవ సంబరాల్లో ఈ తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు, మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తున్నామని సీఎం అన్నారు. నిన్నటి దురదృష్టకర ఘటనపై చర్చించిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నామని సిద్ధరామయ్య వెల్లడించారు.

Also Read: కుమార్తెను వేధిస్తున్నాడని.. బాలుడిని కొట్టి కొట్టి హత్య

దీంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ, డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సిద్దరామయ్య చెప్పారు. వారిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. మూడు సంస్థలపై (ఆర్సీబీ, డీఎన్ఏ ఈవెంట్స్, కేఎస్‌సీఏ) దర్యాప్తును సీఐడీకి అప్పగించాం" అని ఆయన పునరుద్ఘాటించారు."నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి ఘటన జరగలేదు. ఈ ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది" అని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు సిద్దరామయ్య వెల్లడించారు. 

Also Read: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు