/rtv/media/media_files/2025/11/28/ayyappa-devotees-can-carry-irumudi-on-flights-says-civil-aviation-ministry-2025-11-28-15-44-43.jpg)
Ayyappa Devotees Can Carry Irumudi On Flights Says Civil Aviation Ministry
అయ్యప్ప భక్తులకు(ayyappa-devotees) భారత పౌరవిమానయాన శాఖ గుడ్న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. భక్తులు సౌకర్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని తన ఎక్స్లో ప్రకటించారు. '' శబరిమల(sabarimala) యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తులు నేరుగా విమానంలో ఇరుముడి(Irumudi)ని తీసుకెళ్లేలా పౌర విమానయాన మంతిత్వ శాఖ పర్మిషన్ ఇచ్చింది.
Also Read: దారుణంగా దేశ రాజధాని..సివియర్ ఎయిర్ పొల్యూషన్ తో నరకం
Ayyappa Devotees Can Carry Irumudi On Flights
ఇరుముడికి ఉన్న పవిత్రతను, భావోద్వేగాలను గౌరవిస్తూ.. భక్తుల సంప్రదయాలు, ఆచారాలకు ఎలాంటి భంగం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలను గౌరవించేలా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని'' రామ్మోహన్ నాయుడు అన్నారు.
స్వామియే శరణం అయ్యప్ప!
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) November 28, 2025
శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి… pic.twitter.com/QT6JGV45Ng
Also Read: మావోయిస్టుల సంచలన ప్రకటన..జనవరి 1న సామూహికంగా లొంగిపోతాం
Follow Us