Crime News : ఢిల్లీలో దారుణం.. అన్న అని రాఖీ కడితే...అన్యాయంగా చంపేశాడు.

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అన్న అని పిలిచి రాఖీ కట్టిన యువతిని కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు ప్రేమించాలని వెంట పడ్డాడు. ప్రేమించలేనని చెప్పినందుకు కక్ష్య పెంచుకున్నాడు. బిల్డింగ్‌ పై నుంచి తోసేయడంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది.

New Update
Crime News

Rakhi tied by brother...he killed him unjustly.

Crime News :  దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అన్న అని పిలిచి రాఖీ కట్టిన యువతిని కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు ప్రేమించాలని వెంట పడ్డాడు. నేను నిన్ను అన్నలా భావించానని ప్రేమించలేనని చెప్పినందుకు కక్ష్య పెంచుకున్నాడు. అంతేకాదు మాట్లాడుదామని పిలిచి బిల్డింగ్‌ పై నుంచి తోసేయడంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. అనంతరం పారిపోయిన యువకున్ని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Also Read: వందేభారత్‌ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈశాన్య ఢిల్లీలోని అశోక్‌నగర్‌ లో  నేహా అనే యువతి నివాసముంటుంది. ఉత్తరప్రదేశ్‌లెని రాంపూర్‌ కు చెందిన తౌఫీక్‌ అనే యువకుడు గత మూడేళ్లుగా అదే ప్రాంతంలో ఉంటున్నాడు.  తౌఫిక్‌.. నేహాతో రోజూ మాట్లాడేవాడు. సోదరుడిగా భావించి ఆమె కూడా మాట్లాడుతూ ఉండేది. అలా సోదరుడు అనే ఉద్దేశంతోనే రాఖీ కూడా కట్టింది. కానీ, తౌఫీక్‌ మాత్రం తన వికృత రూపాన్ని బయట పెట్టాడు. తనను ప్రేమించాలని వేధించాడు. అయితే దానికి నిరాకరించిన నేహా కొంతకాలంగా తౌఫిక్‌ను పక్కన పెడుతూ వస్తోంది.తిరస్కారాన్ని తట్టుకోలేక అవమానంతో రగిలిపోయాడు తౌఫిక్‌. తనకు తప్ప మరెవ్వరికీ దక్కకూడదని భావించి చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!

అయితే సోమవారం  తౌఫిక్‌ బుర్ఖా ధరించి యువతి ఇంటికి వచ్చాడు. నేహా ఇంట్లోకి దొంగచాటుగా వెళ్లాడు తౌఫిక్‌. బుర్ఖా ధరించి వెళ్లిన అతన్ని ఆమె తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చాకచక్యంగా అతన్ని పక్కకు నెట్టి.. నేహా రూమ్‌లోకి వెళ్లాడు. పెళ్లి విషయమై మరోసారి నిలదీశాడు. అందుకు నేహా నిరాకరించడంతో.. ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అంత దూరం నుంచి కిందపడటంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్తానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి నేహా చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తౌఫిక్ ఢిల్లీలోని మండోలి రోడ్డులో పనిచేశాడు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం పారిపోయిన తర్వాత, రాంపూర్‌లో పోలీసు బృందాలు అర్థరాత్రి నిర్వహించిన ఆపరేషన్‌లో అతన్ని ట్రాక్ చేసి అరెస్టు చేశాయి.

బాధితురాలిని నేరుగా కలిసేందుకు మారువేషంలో వచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇరుగుపొరుగు వారు గుర్తించకుండా ఉండేందుకు అలా చేసినట్లు చెప్పాడు. బుర్ఖా ధరించి సంచరించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీడియో ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు