/rtv/media/media_files/2025/05/08/S4634xuO0gG1OrFc2ppo.jpg)
At least 100 terrorists killed in Indian strikes in Pakistan, Says Rajnath Singh
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. 9 ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ విజయవంతంగా మెరుపు దాడులు చేసింది. అయితే ఈ దాడుల్లో ఎంతమంది చనిపోయారనేది ఇప్పటిదాకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ వివరాలను గురువారం ఆయన అఖిపక్ష భేటీలో తెలియజేశారు. ఈ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
The government has stated that over 100 terrorists were killed in #OperationSindoor, and the count is still ongoing. The government also mentioned that Operation Sindoor is still underway, making it difficult to provide an exact number. Additionally, the government said that… pic.twitter.com/q1kme1vT68
— ANI (@ANI) May 8, 2025
Also Read: ఏవోబీలో భారీ ఎన్కౌంటర్.. అగ్రనేతలు మృతి.. ఫైరింగ్ వీడియో వైరల్!
మరోవైపు ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భారత ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుధవారం దీనిపై స్పందించిన రాజ్నాథ్ సింగ్.. శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. ''ప్రధాని నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన సమాధానం చెప్పాం. భారత సైన్యం తన సత్తాను చాటింది. అమాయకుల ప్రాణాలు తీసినవాళ్లు మూల్యం చెల్లించారు. పౌరుల ప్రాణాలకు నష్టం కలిగించకుండా దాడులు నిర్వహించాం. రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. అమాయకులను చంపినవాళ్లనే హతం చేశాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. దేశ భద్రతకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని'' రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Also Read: కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి ఊర మాస్.. తండ్రికి తగ్గ కూతురే..!
ఇదిలాఉండగా భారత్లో చొరబాటుకు యత్నించిన ఓ పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. మే 07వ తేదీ బుధవారం అర్ధరాత్రి సమయంలో ఫిరోజ్పూర్ సెక్టార్లో పాకిస్థాన్ వ్యక్తి చొరబాటుకు యత్నించించాడు. చీకటినిఆసరాగా చేసుకుని బార్డర్ దాటలని ప్రయత్నించడాన్ని గమనించిన బీఎస్ఎఫ్ కాల్పులు జరిపారు. మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు.
Indian Army | rajnath-singh | rtv-news