AAP: ఆప్‌ అభ్యర్థులకు బీజేపీ గాలం !.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం

బీజేపీ 16 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఆప్.. 70 మంది పార్టీ అభ్యర్థులకు కేజ్రీవాల్‌ నివాసంలో శుక్రవారం భేటీ కావాలని పిలుపునిచ్చింది. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం

New Update
Arvind Kejriwal calls meeting of all 70 candidates today

Arvind Kejriwal calls meeting of all 70 candidates today

రేపు (శనివారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌ ఈసారి బీజేపీ (BJP) అధికారం చేపట్టబోతుందని అంచనా వేశాయి. దీంతో రేపు జరగనున్న ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ 16 మంది ఆప్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ అప్రమత్తమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 70 మంది పార్టీ అభ్యర్థులు కేజ్రీవాల్‌ నివాసంలో భేటీ కావాలని ఆదేశించింది.    

Also Read: అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారి పరిస్థితి ఏంటి? వారి జీవితం ఎలా ఉండబోతోంది?

Arvind Kejriwal Meeting

ఈ క్రమంలోనే ఫిరోజ్‌ షా రోడ్‌లోని కేజ్రీవాల్ (Kejriwal) నివాసంలో సీఎం అతిశీ, మాజీ మంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) తో పాటు ఆప్ అభ్యర్థులు, పార్టీ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఆప్ సీనీయర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌ ఈ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు. ఆప్ అభ్యర్థి ముఖేష్ కుమార్‌ అహ్లావత్‌కు గురువారం ఓ కాల్‌ వచ్చిందని ఆ నెంబర్‌ను పరిశీలించి తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 

Also Read: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇదిలాఉండగా ఆప్ అభ్యర్థులను ప్రలోభ పెట్టి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ అభ్యర్థులు శుక్రవారం భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇక ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగగా.. ఫలితాలు 8న విడుదల కానున్నాయి. మెజార్టీ సర్వేలు బీజేపీ గెలుస్తుందని అంచనా వేయగా.. కేకే అనే పోల్ సంస్థ తమ సర్వేలో ఆప్ గెలుస్తుందని చెప్పింది. ఓ వైపు బీజేపీ, మరోవైపు ఆప్‌ తామే గెలుస్తామంటూ ధీమాగా ఉన్నాయి. మరి ఢిల్లీ ప్రజలకు ఎవరికి అధికారం పీఠం అప్పగించారో తెలియాలంటే రేపటి వరకు వేచిచూడాల్సిందే.  

Also Read :  ఆపరేషన్ థియేటర్ లో నీలం, ఆకుపచ్చ రంగే ఎందుకు ధరిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా

Also Read :  వీడు టీచర్ కాదు టార్చర్.. తన్నిన సిగ్గు రాలే: మరో విద్యార్థినిని ఏం చేశాడంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు