/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
suicide
Suicide : పోటీపరీక్షలు అనగానే భయామో, లేక విజయం సాధించలేమన్న అపనమ్మకమో కానీ పోటీ పరీక్షల కోచింగ్కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గడచిన ఏడాది కాలంగా ఇక్కడ ఆత్మహత్యలు కొనసాగుతుండగా 2025లో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 15కు చేరింది. తాజాగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ నెలలో ఇది రెండో ఆత్మహత్య కావడం గమనార్హం.
Also Read : చికెన్ నెక్ వివాదం.. బంగ్లాదేశ్కు హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మూకశ్మీర్ కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని జీషాన్ నెలరోజుల క్రితమే నీట్ కోచింగ్ కోసం కోటాకు వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రతాప్ చౌరాహా ప్రాంతంలో పేయింగ్ గెస్ట్గా ఉంటూ నీట్కుసన్నద్ధమవుతోంది. రోజులాగే ఆదివారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన జీషాన్ ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో విద్యార్థిని స్నేహితురాలికి కాల్ చేశారు. వెంటనే ఆమె జీషాన్ గది వద్దకు వెళ్లింది. లోపలి నుంచి గడియ వేసి ఉండడంతో ఆమె చాలాసేపు పిలిచింది. అయినా పలకకపోవడంతో ఇతరుల సాయంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే జీషాన్ ఉరివేసుకుని కనిపించడంతో ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమెను పరీక్షించిన వైద్యలు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్.. ఎక్కడంటే?
కాగా ఈ నెల 3న మధ్యప్రదేశ్కు చెందిన మరోనీట్ అభ్యర్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా కోటాలో గడచిన ఏడాది కాలంగా విద్యార్థుల సూసైడ్ కేసులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు అక్కడి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోటాలోనే విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?, విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తోందని కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది? అసలు ప్రభుత్వం ఈ విషయంపై ఎందుకు ఆలోచించడం లేదు? అని న్యాయస్థానం సుప్రీం దర్మాసనం నిలదీసింది. ఈ ఏడాది ఇప్పటికి వరకు 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. అయినప్పటికీ నేడు మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: తిన్న తర్వాత ఈ ఐదు సమస్యలు ఉంటే ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం