CPI (Maoist) : 20న తెలంగాణ, ఏపీ బంద్కు పిలుపునిచ్చిన మవోయిస్టులు
ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ.. ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. తెలుగు రాష్ట్రాల బంద్కు ప్రజలు సహకారం అందించి.. విజయవంతం చేయాలని కోరుతూ.. మావోయిస్టు నేత జగన్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు.