Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం!

ఈ మధ్యకాలంలో ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ వరుస వివాదాల్లో చిక్కుకొంటుంది. వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని అహమ్మదాబాదులో జరిగిన ప్రమాదంలో రెండువందలమందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో విమానాన్ని పక్షి ఢీకొట్టింది.

New Update
Air India

Air India flight

 Air India:  ఈ మధ్యకాలంలో ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ వరుస వివాదాల్లో చిక్కుకొంటుంది. వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని అహమ్మదాబాదులో జరిగిన ప్రమాదంలో రెండువందలమందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. దాని తర్వాత పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. కాగా మరో ఎయిర్‌ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. దీంతో ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి ఉండగా దాన్ని రద్దు చేశారు.

Also Read :  ENG vs IND : అయ్యో సాయి.. డెబ్యూ మ్యాచ్ లోనే డకౌట్!

Air India Flight Journey Cancelled

Also Read :  తెరుచుకున్న గగనతలం..1000 మంది ఇండియన్స్‌ రిటర్న్‌

శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణెకు  బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. పక్షి ఢికొట్టిన తర్వాత విమానాన్ని సురక్షితంగా పుణెలో ల్యాండ్ చేశారు,  అనంతరం సేఫ్టీ చెక్‌ చేయగా విమానాన్ని పక్షి ఢీకొట్టినట్టు గుర్తించామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

పుణె నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ ఎయిరిండియా విమానాన్ని  క్యాన్సిల్‌ చేశారు. పక్షి ఢీకొట్టడంతో ఏదైన ప్రమాదం జరుగుతుందన్న అనుమానంతో రిటర్న్ ఫ్లైట్‌ను రద్దు చేశామని ఎయిర్‌ ఇండియా కంపెనీ  తెలిపింది. ప్రయాణికులకు బోర్డింగ్ తో పాటు , రీఫండ్ ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణీకుల కోసం  ప్రత్యామ్నాయ ఫ్లైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది.

Also Read :  Secunderabad మిలిటరీ ఏరియాలో చొరబాటు.. నలుగురు అరెస్ట్

Also Read :  ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం!

Air Indiaa | air india boeing | air india crash | air india flight crash | Air India Flight | air india flight emergency landing

Advertisment
Advertisment
తాజా కథనాలు