/rtv/media/media_files/2025/06/20/iran-opens-airspace-only-for-india-2025-06-20-17-31-54.jpg)
Iran Opens Airspace Only For India
Iran : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన పలువురు విదేశీయులు తమతమ సొంతదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయులు కూడా ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే భారతీయులను తమ దేశానికి తీసుకెళ్లడానికి భారత్ సిద్దమవడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల కోసం తన గగనతలాన్ని తెరిచింది.
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎనిమిదో రోజులుగా రెండు దేశాలమధ్య బాంబుల వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం కూడా ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. ప్రతిగా క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇజ్రాయెల్పైకి టెహ్రాన్ ఎక్కుపెట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.
ఇక రెండు దేశాల్లో ప్రస్తుతం ఉన్న యుద్ధవాతావరణంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇరాన్కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల తరలింపుకోసం ఇరాన్ తన గగనతలాన్ని తెరిచింది. ఈ చర్యతో అక్కడ చిక్కుకున్న దాదాపు 1,000 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకోనున్నారు. ఇండియన్స్ తరలింపులో భాగంగా భారతీయులతో కూడిన తొలి విమానం ఈరోజు రాత్రి 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఢిల్లీకి చేరుకోనుంది. మరో రెండు, మూడు విమానాలు శనివారం ఉదయం ఒకటి, సాయంత్రం మరొకటి స్వదేశానికి చేరుతాయని ఆధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా భారతీయ విమానాలకు మాత్రమే అనుమతిస్తూ తన గగనతలాన్ని తెరిచింది. దీంతో భారతీయులు తిరిగి ఇండియాకు చేరుకోనున్నారు.