ENG vs IND : అయ్యో సాయి.. డెబ్యూ మ్యాచ్ లోనే డకౌట్!

ఇంగ్లండ్, ఇండియా జట్ల మధ్య  ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ప్రారంభమైంది. లీడ్స్‌ వేదికగా తొలి మ్యాచ్ మొదలు కాగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

New Update
saisudarshan

ఇంగ్లండ్, ఇండియా జట్ల మధ్య  ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ప్రారంభమైంది. లీడ్స్‌ వేదికగా తొలి మ్యాచ్ మొదలు కాగా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లీష్ జట్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (42), యశస్వీ జైస్వాల్ (42*) మంచి శుభారంభాన్ని ఇచ్చారు.  ఇద్దరూ చక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 91 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి

బ్రైడన్ కార్స్ వేసిన 24.5 ఓవర్‌కు స్లిప్‌లో ఫస్ట్ స్లిప్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. ఆ కాసేటికే టీమిండియాకు మరో బిగ్ షాకిచ్చింది ఇంగ్లండ్ టీమ్.  వన్ డౌన్ ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ (0) తన తొలి టెస్టు మ్యాచ్ లోనే డకౌట్ గా వెనుదిరిగాడు. నాలుగు బంతులు ఎదురుకుని స్టోక్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.  దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.  యశస్వి జైస్వాల్ (41), పంత్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ సమయానికి టీమిండియా స్కోరు 92/2 గా ఉంది.  

తొలి టెస్టు మ్యాచ్‌లోనేడకౌట్ అయిన  భారత ఆటగాళ్లలో  2002లో అజయ్ రాత్ర ,2010లో  వృద్ధిమాన్ సాహా, 2018లో హనుమ విహారి, 2025లో  సాయి సుదర్శన్  ఉన్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు