ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు.. ఓపల్ సుచాతా చువాంగ్శ్రీ. తాజాగా 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ బ్యూటీ. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ అందాల పోటీల్లో ఓపల్ సుచాతా విజేతగా నిలించింది. ఇందులో మొత్తం 108 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనగా.. థాయ్లాండ్కు చెందిన సుచాతా విజేతగా ఎంపికయ్యారు.
Also Read : ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ఈ థాయ్లాండ్ ముద్దుగుమ్మ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని సాధించడంతో.. ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఇంటర్నెట్లో వెతికేస్తున్నారు. ఈ తరుణంలో ఆమె గురించి తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఆమె హెల్త్ ఇష్యూస్ పై సంచలన విషయాలు తెలియడంతో ఆవేదనకు గురవుతున్నారు.
Also Read : ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
16 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్
ఓపల్ సుచాతా చువాంగ్శ్రీ తన 16 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. రొమ్ములో నిరపాయమైన కణితి ఉన్నట్లు నిర్ధారణ అవడంతో ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ అనుభవం ఆమెను అందాల పోటీల వైపుకు తీసుకెళ్లింది. రొమ్ము క్యాన్సర్, మహిళల ఆరోగ్యం గురించి దృష్టి సారించడానికి ఆమె అందాల పోటీల వేదికలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది.
Also Read : ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?
కాగా ఓపల్ సుచాత చువాంగ్శ్రీ.. 2003 సెప్టెంబర్ 20న థాయ్లాండ్లోని పుకేట్లో జన్మించారు. ప్రస్తుతం ఈమెకు కేవలం 21 ఏళ్లే. వీళ్ల కుటుంబం ఓ ప్రైవేట్ కంపెనీని నడుపుతోంది. ఆమె ప్రైమరీ, లోయర్ సెకండరీ విద్యను కాజోంకిట్సుక్సా స్కూల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత ట్రయం ఉడోమ్ సుక్సా స్కూల్లో అప్పర్ సెకండరీ విద్యను పూర్తి చేసింది.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఈమె.. థమ్మసాట్ యూనివర్సిటీలో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు. ఓపల్ సుచాత 2024లో మిస్ యూనివర్స్ థాయ్లాండ్ కిరీటాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2024 మిస్ యూనివర్స్ పోటీలకు థాయ్లాండ్ నుంచి ప్రాతినిత్యం వహించారు. అక్కడ ఆమె మూడో రన్నర్ అప్గా నిలిచారు. తాజాగా 2025 మిస్ వరల్డ్ సుందరీగా విజయం సాధించారు.