అరేయ్ ఒక్కొక్కడిని వేటాడి వెంటాడి... అమిత్ షా మాస్ వార్నింగ్ | Amit Shah Serious Warning To Pakistan
27 మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఉగ్రవాదుల జాడ కనిపెట్టి వారిని అంతమొందిస్తామని తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో 1,200 మంది పాకిస్తానీ జాతీయులు ఉన్నట్లుగా ఆ రాష్ట్ర అధికారులు గుర్తించారు. కేంద్రం నుండి బహిష్కరణ ఉత్తర్వులు రాగానే వారిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్రంలో పాకిస్తానీ జాతీయులను గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని అన్నారు.
పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రదాడిని చూసి ప్రతీ భారతీయుడు బాధను అనుభవిస్తున్నాడని.. దీన్ని వర్ణించలేమని అన్నారు. అమాయక ప్రజలను చంపిన ఉగ్రవాదులందరినీ వదిలిపట్టేది లేదని స్పష్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్ లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.