/rtv/media/media_files/2025/05/08/f9J9UMqo5hLhVJbYCIO6.jpg)
Amit Shah asks All States and Union Territories to maintain strict vigil against anti-national propaganda on social media
కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పలు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల సీఎంలతో గురువారం సమీక్ష సమావేశం చేశారు. ఆ భేటీలో హోం మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలాఉండగా ఆపరేషన్ సిందూర్కు సంబంధించి పాకిస్థాన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తోంది.
Also Read: ఏవోబీలో భారీ ఎన్కౌంటర్.. అగ్రనేతలు మృతి.. ఫైరింగ్ వీడియో వైరల్!
భారత్ కూడా ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం మంత్రిత్వశాఖ సూచనలు చేసింది. ఆపరేషన్ సిందూర్పై, భారత్ భద్రత గురించి ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే దేశం నుంచి విదేశాల నుంచి కూడా భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. ఆయా సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే బ్లాక్ చేయాలని తెలిపింది. అలాగే దేశ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వాలకు, భద్రతా దళాలకు మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు పెంచాలని చెప్పింది.
Also Read: కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి ఊర మాస్.. తండ్రికి తగ్గ కూతురే..!
ఇదిలాఉండగా మంగళవారం అర్ధరాత్రి దాటక పాక్, POKలో ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైన్యం వైమానిక దాడులు చేసింది. తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్లో భాగంగా కనీసం 100 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్ వివరాలను గురువారం ఆయన అఖిపక్ష భేటీలో తెలియజేశారు. అలాగే ఈ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
Also Read: భారత్ లోకి చొరబాటుకు పాక్ వ్యక్తి యత్నం.. లేపేసిన బీఎస్ఎఫ్!
rtv-news