/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలపై పెద్ద ఎత్తున విమర్శలు వినపడుతున్నాయి. ఇటీవలే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనకు విరిగిపోయిన కుర్చీ ఇచ్చారంటూ పోస్ట్ పెట్టగా.. ఆ తర్వాత రెండ్రోజులకే మరో బీజేపీ నేత ఎయిర్ ఇండియా చెత్త సర్వీస్ అంటూ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అయితే తాజాగా మరో యువతి కూడా ఎయిర్ ఇండియాపై విమర్శలు గుప్పించింది.
Also Read: Syria:సిరియాలో పోలీసుల మృతితో ప్రభుత్వం రివేంజ్.. అసద్ గ్యాంగ్ లో 200 మంది మృతి!
తన 82 ఏళ్ల వయసు ఉన్న అమ్మమ్మ కోసం ముందుగానే వీల్ఛైర్ బుక్ చేసుకోగా.. సదరు సంస్థ నిరాకరించిందని చెప్పుకొచ్చింది. ఫలితంగా ఆమె కిందపడి తీవ్ర గాయాలపాలైందని.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుందని వృద్దురాలి మనవరాలు వివరించింది.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్న్యూస్.. ఐదు రోజుల పాటూ..
82 ఏళ్ల రాజ్ పస్రిచా.. ఆమె మనవరాలు పరౌల్ కన్వర్ మార్చి 4వ తేదీన ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ ఇండియాలో విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే తన అమ్మమ్మ నడవడం కష్టం కాబట్టి ఆమెకోసం ముందస్తుగానే వీల్ఛైర్ బుక్ చేశారు. ఈ క్రమంలోనే విమాన సమయానికంటే రెండు గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ అక్కడి ఎయిర్ ఇండియా సిబ్బంది మాత్రం చక్రాల కుర్చీ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో గంటసేపు అక్కడే నిలబడి వీల్ఛైర్ కోసం వేచి చూశారు.
అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. విమానం వెళ్లిపోతుందనే భయంతో వృద్ధురాలైన తన అమ్మమ్మను నడిపించుకుంటూనే తీసుకు వెళ్లింది పరౌల్ కన్వర్. అయితే వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఆమె నడవడానికి చాలా ఇబ్బంది పడి మధ్యలోనే కింద పడిపోయింది. ఫలింతగా తీవ్ర గాయాలు అయ్యాయి. అయినప్పటికీ ఎయిర్ ఇండియా సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో పరౌల్ గొడవ చేయగా.. ఆ తరువాత ఆమెకు ఎయిరిండియా సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి ఆమెను విమానంలో ఎక్కించారు.
అయితే అప్పటికే అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో.. బెంగళూరులో దిగిన వెంటనే పరౌల్ తన అమ్మమ్మను ఆస్పత్రికి తరలించింది. ఈక్రమంలోనే ఆమెకు రెండు కుట్లు పడ్డాయి. కానీ ఆ తర్వాత చేసిన స్కానింగ్లలో ఆమె మెదడులో తీవ్ర రక్త స్రావం అవుతున్నట్లు గుర్తించి ఐసీయూలో ఉంచారు. దీంతో కుటుంబం అంతా తీవ్ర మనస్తాపం చెందుతున్నట్లు చెబుతూ.. పరౌల్ కన్వర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిలి ఏవియేషన్కు, ఎయిరిండాకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా.. బాధితురాలు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై విచారణకు పూర్తి వివరాలు అందించాలని పరౌల్ కన్వర్ను కోరారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
Also Read: USA: స్టార్ షిప్ ఎఫెక్ట్..240 విమానాల రాకపోకలకు అంతరాయం