/rtv/media/media_files/2025/02/07/zauC8SsQ2LsrvowLUs0b.jpg)
Pakistani Hindu pilgrims take holy dip at Maha Kumbh
ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిత్యం లక్షలాది మంది భక్తులు అక్కడికి పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 33 కోట్లమందికి పైగా భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే పాకిస్థాన్లోని సింధూ ప్రావిన్స్కు చెందిన 68 మంది హిందువులు కూడా గురువారం కుంభమేళాకు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు.
Also Read: ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం !.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం
ప్రత్యేక వీసాలపై కుంభామేళాకు వచ్చిన ఆ హిందువులు.. తమ పూర్వీకులు అస్థికలు కూడా త్రివేణి సంగమంలో కలిపారు. ఈ నేపథ్యంలో వీళ్ల బృందంలోని మహంత్ రామకాంత్ అనే వ్యక్తి మాట్లాడారు. తాము ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు రాకముందు.. హరిద్వార్కు వెళ్లామని చెప్పారు. అక్కడ తమ పూర్వీకులకు చెందిన 480 అస్థికలకు పూజలు నిర్వహించామని తెలిపారు. ఆ తర్వాత త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి.. తన పూర్వికుల అస్థికలు కలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారి పరిస్థితి ఏంటి? వారి జీవితం ఎలా ఉండబోతోంది?
మరో వ్యక్తి మాట్లాడుతూ.. గత కొన్నినెలల నుంచి కుంభమేళా గురించి వింటున్నానని.. ఎప్పటికైనా ఇక్కడికి రావాలనే కోరిక ఉండేదని చెప్పారు. అయితే ఈ 68 మంది పాక్ హిందూ యాత్రికుల్లో 50 మంది మొదటిసారిగా కుంభమేళాను సందర్శించారు. అలాగే ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు చెప్పుకొచ్చారు. జనవరి13న మొదలైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శంకరాచార్య మార్గ్లోని సెక్టార్ 18లో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ సాగుతోంది.
Also Read: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు!