/rtv/media/media_files/2025/05/05/abHTRTnPca3iPoy34ik3.jpg)
pak assam
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కు మద్దతు పలికిన మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం అరెస్టుల సంఖ్య 42కి చేరుకుందన్నారు. బార్పేట, హోజాయ్, చిరాంగ్ జిల్లాల నుండి ఒక్కొక్కరిని అరెస్టు చేసినట్లుగా సీఎం వెల్లడించారు.
Also Read : PM Modi: ఆర్మీ సూట్లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
Also read : TGSRTC : బస్సు భవన్ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..
#Update on Crackdown against traitors for defending Pakistan on Indian soil- 20.30hrs | 04 May
— Himanta Biswa Sarma (@himantabiswa) May 4, 2025
1️⃣Azibor Rehman arrested by @Barpeta_Police
2️⃣ Joynal Uddin arrested by @Hojai_Police
3️⃣ Asraful Islam arrested by @chirangpolice
Total of 42 Anti Nationals put behind BARS.
దేశద్రోహ ఆరోపణలపై
అంతకుముందు, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ను సహకారాన్ని సమర్థించారనే ఆరోపణలతో ప్రతిపక్ష AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను దేశద్రోహ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారి కాళ్ళు విరగ్గొడతానని సీఎం హెచ్చరించారు. ప్రపంచంలో ఎక్కడైనా దాక్కున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను తీసుకువచ్చే శక్తిని ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని దేవుణ్ని కోరుకుంటున్నాని తెలిపారు. కాగా ఏప్రిల్ 22న దక్షిణ కశ్మీర్లోని పహల్గామ్లో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశం బైసారన్పై ఉగ్రవాదులు దాడి చేశారు, ఈ ఘటనలో 26 మంది మరణించారు.
Also read : India vs Pakistan : భారత్ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్ మరోసారి క్షిపణి ప్రయోగం?
Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?