Maharshtra: దారుణం.. బస్సులో మహిళపై అత్యాచారం

మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. రద్దీగా ఉన్న బస్టాండ్‌లో ఆగిఉన్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరగడం కలకలం రేపింది. ఫిబ్రవరి 25న ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

New Update
old woman raped

old woman raped

మహారాష్ట్ర (Maharashtra) లోని పూణేలో దారుణం జరిగింది. రద్దీగా ఉన్న బస్టాండ్‌లో ఆగిఉన్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం (Rape) జరగడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఔంధ్ బనేర్‌ ప్రాంతంలో ఉండే 26 ఏళ్ల మహిళ ఓ ఆస్పత్రిలో కౌన్సెలర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25న ఉదయం 6 గంటల సమయంలో స్వర్గేట్‌ బస్టాండ్‌కు వచ్చింది. అయితే ఆమె వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు మరో ప్లాట్‌ఫామ్‌ వద్ద ఉందని చెప్పాడు. 

Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం

ఇది నమ్మిన మహిళ అతడి వెంట వెళ్లింది. ఎవరూ లేని చీకటి ప్రదేశంలో పార్కు చేసిన బస్సు వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. ప్రయాణికులు ఎవరూ లేరని ఆమె అడగ్గా బస్సు లోపల కూర్చున్నారని అతడు చెప్పాడు. ఆమె బస్సులోకి వెళ్లగానే అతడు కూడా ఎక్కి డోర్‌ లాక్‌ చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన అనంతరం ఆమె పోలీసులకు చెప్పేందుకు బయపడింది. చివరికీ ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.    

Maharashtra Rape Case

Also Read: ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే!

ఆమె సాయంతో స్వర్గేట్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని దత్తాత్రామ్‌ రామ్‌దాస్‌ గడేగా గుర్తించారు. అంతేకాదు శిక్రపూర్, శిరూర్‌ పోలీస్‌ స్టేషన్లలో అతడిపై దొంగతనం కేసులున్నట్లు కూడా చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు 8 పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.  

Also Read :  రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్!

Also Read: ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్.. కవిత మళ్లీ జైలుకు!?

Advertisment
Advertisment
తాజా కథనాలు