Memory: బోర్డు పరీక్షలు ఫిబ్రవరి రెండవ వారంలోనే ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తాము చదివిన విషయాలు కూడా మర్చిపోతామని ఆందోళన చెందుతుంటారు. చదివే సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అయితే కొందరూ ఎంత చదివినా.. పదే పదే చదివినా మరచిపోయే సమస్య ఉంటుంది. అలాంటి వారు ఈ చిట్కాల సహాయంతో సమస్యను తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.ఇది కూడా చదవండి: మధుమేహంతో ఇబ్బందిగా ఉందా.. ఈ ఆకులు తింటే మీ వ్యాధి పరార్ మైండ్ రిఫ్రెష్ అయి ఒత్తిడి లేకుండా.. జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవచ్చు. చదువు కోవడానికి కూర్చునే ముందు పెన్సిల్ లేదా హైలైటర్ని తీసుకెళ్లండి. ఇది చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలు, నిబంధనలు లేదా నిర్వచనాలను హైలైట్ చేయడానికి సహాయపడుతుంది. బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కావడానికి మీకు రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ నిరంతరం కూర్చుని ఒకేసారి అనేక నిబంధనలు లేదా కాన్సెప్ట్లను క్లియర్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: చలికాలంలో వేరుశెనగ తిన్నాక ఈ పొరపాటు చేయొద్దు మధ్యలో విరామం తీసుకోవడం అవసరం. అప్పుడే మైండ్ రిఫ్రెష్ అయి ఒత్తిడి లేకుండా బాగా చదువుకోవచ్చు. రోజూ ఏది చదువుతున్నా, అధ్యయనం ప్రారంభించే ముందు ప్రతిరోజూ దాన్ని రివైజ్ చేసుకోవాలి. రివిజన్ చేయడం ద్వారా మెమరీ పవర్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకుంటారు. ఇలా రోజు చేయటం ద్వారా జ్ఞాపకశక్తి పెరగటంతోపాటు పరీక్షలల్లో మంచి మార్కులు సాదిస్తారని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: చిక్పీస్ తింటే షుగర్ తగ్గుతుందా?.. ఇందులో నిజమెంత? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: రాత్రి స్వెట్టర్ వేసుకుని నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు