/rtv/media/media_files/2025/05/17/gDHLA1RGdUhnSpUWev0D.jpg)
Khammam vaira Mega Jab Mela on May 24th
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. సింగరేణి సంస్థ సహకారంతో మే 24న ఖమ్మం జిల్లా వైరాలో మేగా జామ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. 80 సంస్థలు, 5000 ఉద్యోగాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా కింద ఇచ్చిన స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
సింగరేణి సంస్థ సహకారంతో
— Singareni Public Relations (@PRO_SCCL) May 17, 2025
ఈనెల 24 న
ఖమ్మం జిల్లా వైరా లో నిర్వహించనున్నమెగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మాత్యులు శ్రీ భట్టి విక్రమార్కమల్లు.
80 కంపెనీలతో 5000 ఉద్యోగ అవకాశాల కల్పన
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ రామసహాయం రఘురామ్ రెడ్డి, వైరా… pic.twitter.com/dJE1lYzxvG
Also Read : అల్లుడు ఆరోపణలు.. అత్త కౌంటర్.. ముదురుతోన్న విడాకుల పంచాయతీ!
Khammam Jab Mela on May 24th 2025
ఈ మేరకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను వినియోగించుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. 80 సంస్థల్లో 5000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. వైరా పట్టణం NVS గార్డెన్ మజీద్ రోడ్ లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ అవకాశాల కల్పన కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే శ్రీ రాందాస్ నాయక్ , సింగరేణి సీఎండి శ్రీ ఎన్. బలరామ్ పాల్గొన్నారు.
Also Read : భారత్, పాకిస్థాన్ చర్చలు మళ్లీ ప్రారంభించాలి.. రష్యా కీలక ప్రకటన
ఈ నెల 24 న మన వైరా లో ఎమ్మెల్యే శ్రీ రాందాస్ నాయక్ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
— MLA Ramdas Nayak (@MLARamdasNayak) May 17, 2025
⏭️80 సంస్థలు,5000 ఉద్యోగాలు
ప్లేస్: వైరా పట్టణం NVS గార్డెన్ మజీద్ రోడ్
ఈ నెల 24 శనివారం ఉదయం 9 గం, ల నుండి @INCTelangana@Bhatti_Mallu @INC_Ponguleti @revanth_anumula pic.twitter.com/D0VQGrdUUF
Also Read : బికినీ అందాలతో రెచ్చిపోయిన ఖుషీ కపూర్.. వెకేషన్ అతడు కూడా!
ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. 2024--25 జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ శాఖల్లో 35 వేల ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. విద్య, వైద్య, ఆర్టీసీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్రంలో SC వర్గీకరణ పూర్తికావడంతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2024-25 ఏడాదిలో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఇప్పటికే కీలక మార్పులు చేపట్టింది. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు, ఉద్యోగాల భర్తీ సవరణ చేసేందుకు ప్రణాళికలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తొలి విడతలో 20 వేలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : పాకిస్థాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఎంపీ డిమాండ్
today telugu news | telugu-news | khammam | mega-job-mela