/rtv/media/media_files/2025/05/17/FO0W4lRHwcIMaYqweTKC.jpg)
After China, Russia joins US in nudging India to restart stalled dialogue with Pakistan
భారత్ పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇరుదేశాలు చర్చలు జరపాలని అమెరికా, చైనా భారత్కు ఇటీవలే సూచనలు చేశాయి. ఇప్పుడు తాజాగా రష్యా కూడా ఇలాంటి సూచనే చేసింది. దీనిపై రష్యన్ ఫెడరేషన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడారు. '' భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్యలపై ప్రత్యక్ష శాంతి ఒప్పంద చర్చలు జరపాలని కోరుతున్నాం. ఈ విషయంలో ఇరుదేశాలు ముందుకెళ్లాలని కోరుతున్నామని'' అన్నారు.
Also Read: ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్.. 20 మంది మావోయిస్టు నేతలు అరెస్ట్!?
India - Pak Discussions
ఇటీవల భారత్-పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా స్వాగతించింది. ఇరుదేశాల మధ్య ఘర్షణ నివాణకు తాము ఎప్పటికీ సపోర్ట్ చేస్తామని తెలిపింది. ప్రధాని మోదీ, పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ శాంతి మార్గాన్ని ఎంచుకోవడాన్ని అభినందిస్తున్నామని చెప్పింది. ప్రత్యక్ష చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలని అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు ఆశిస్తున్నట్లు పేర్కొంది.
Also Read: అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం
ఇక భారత్-పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు పాక్ వైపు సానుకూలంగా ఉన్న చైనా.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపింది. చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచనలు చేసింది. మరోవైపు పాక్తో చర్చలు ద్వైపాక్షికంగానే జరుగుతాయని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై మాత్రమే చర్చలుంటాయని తేల్చిచెప్పింది. భారత్తో చర్చలు పాక్ కూడా సిద్ధమని తెలిపింది. శాంతి కోసం దీన్ని ప్రతిపాదిస్తున్నామని పేర్కొంది. కశ్మీర్ అంశాన్ని కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
Also Read : పాకిస్థాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి.. ఎంపీ డిమాండ్
rtv-news | national-news | india-pakistan