/rtv/media/media_files/2025/05/31/zU0ULbg1ojHfcPFy7uiO.jpg)
Trump Special gift to Musk
USA: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ సారథిగా టెక్ అధిపతి ఎలాన్ మస్క్ పని చేశారు. ఇప్పుడు దాదాపు ఆరు నెలల తరువాత డోజ్ కు వీడ్కోలు పలికారు మస్క్. మే 30 ఆయనకు చివరి రోజు. దాంతో ఎలాన్ మస్క్...అధ్యక్షుడు ట్రంప్ కలవడానికి వెళ్ళారు. దీంతో ఆయన టెస్లా అధిపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. డోజ్కు సేవలు అందించినందుకు గానూ మస్క్కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ తెలిపారు. అమెరికా దేశం తరుఫున దానిని అందించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఇందులో మస్క్ సేవలను ట్రంప్ కొనియాడారు. తనకు అప్పగించిన బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు.
Also Read: cinema: కన్నప్ప హార్డ్ డ్రైవ్ ను మనోజ్ ఇంట్లో పని వాళ్ళే దొంగిలించారు..విష్ణు
అధ్యక్షుడికి ఎప్పుడూ తోడుగానే ఉంటా..
ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ కూడా మాట్లాడారు. డోజ్ నుంచి తప్పుకుంటున్నా అమెరికా అధ్యక్షుడికి తోడుగానే ఉంటానని చెప్పారు. తరుచుగా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తానన్నారు. డోజ్ పదవి ముందు నుంచీ కాల పరిమితితో కూడుకున్నదని...తాను అందుకు అంగీకరించే వచ్చానని మస్క్ చెప్పారు.
డోజ్ లో ఎలాన్ చాలా నిర్ణయాలే తీసుకున్నారు. ప్రభుత్వంలో సమూల మార్పులను చేశారు. ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులను తొలిగించారు. దీంతో మస్క్ విమర్శలు కూడా పాలయ్యారు. డోజ్ ద్వారా ప్రభుత్వానికి దాదాపు 11 బిలియన్ల డాలర్లను సేవ్ చేశామని ఎలాన్ మస్క్ చెప్పారు. అయితే ట్రంప్ ఇటీవల్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ యాక్ట్ ను తీసుకువచ్చారు. దీనిపై మస్క్ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దాని కారణంగా ఆయన డోజ్ ను విడిచిపెడుతున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. దీని ప్రకారం మే 30తో మస్క్ గడువు పూర్తయింది.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
Also Read: AP: తప్పుల తడకగా పదవ తరగతి ఫలితాలు..ఐదుగురు వాల్యూయేటర్లు సస్పెండ్