AP 10th Class Result Controversy: తప్పుల తడకగా పదవ తరగతి ఫలితాలు.. ఐదుగురు వాల్యూయేటర్లు సస్పెండ్

ఏపీలో పదవ తరగతి ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. పాసయి, మంచి మార్కులు వచ్చే విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇప్పుడు రీ వాల్యూయేషన్ లో లోపాలు అన్నీ బయటపడుతున్నాయి. దీంతో 5 మంది వాల్యూయేటర్లను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.

New Update
ap 10th class public exam time table 2025

ap 10th class public exam time table 2025 Photograph: (ap 10th class public exam time table 2025)

AP 10th Class Result Controversy: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి విద్యార్థుల మార్కులు గందరగోళం సృష్టిస్తున్నాయి. పాసవ్వాల్సిన విద్యార్థులను వాల్యూయేటర్లు ఫెయిల్ చేశారు. తొంభైల్లో మార్కులు రావాల్సి చోట పాస్ మార్కులు మాత్రమే వేసిన కేసులు కూడా అనేకం వెలుగు చూస్తున్నాయి. దీంతో రికార్డ్ స్థాయిలో  రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌కు 66,363 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 5 మంది వాల్యుయేటర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేశారు. మూడు స్థాయిల్లో పర్యవేక్షణ ఉన్నా లోపాలు నివారించకపోవడంపై విద్యాశాఖ సీరియస్‌ అయింది.

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

ఫెయిల్ అయిన వారికి తొంభైశాతం మార్కులు..

అంతకు ముందు ఫెయిల్ అయిన వారు రీ వాల్యుయేషన్ తరువాత 90కి పైగా మార్కులు రావడం సంచలనంగా మారింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో 38 మందికి అదనంగా 51 నుంచి 80 మార్కుల వరకు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6,14,459 మంది హాజరుకాగా.. వారిలో 34,709 మంది 66,363 జవాబు పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేశారు. ఈ మొత్తంలో 11, 175 జవాబు పత్రాల్లో మార్పులు జరిగాయి. దీంతో ఆంధ్రాలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రీ వాల్యూయేషన్ చేసిన వారు ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై పాఠశాల విద్యాశాఖ సీరియస్ అయింది. ప్రస్తుతానికి ఐదుగురిపై వేటు వేసింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపడతామని చెబుతోంది. 

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

 Also Read: USA: ట్రంప్ సాధించేశారు..సుంకాల విషయంలో అనుకూలంగా మరో కోర్టులో తీర్పు

Advertisment
Advertisment
తాజా కథనాలు