Drone Attack: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడులు..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.

New Update
US embassy in Riyadh hit in drone attack

US embassy in Riyadh hit in drone attack

పశ్చిమాసియా(west-asia) లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ఉన్న అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి(drone-attack) జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరానే ఈ దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సౌదీ అరేబియా రక్షణ శాఖ కూడా స్పందించింది. రెండు డ్రోన్లతో దాడులు జరిగినట్లు వెల్లడించింది. అక్కడ మంటలు చెలరేగడంతో కొద్దిపాటి నష్టం జరిగినట్లు పేర్కొంది. 

Also Read :  గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ

US Embassy In Riyadh Hit In Drone Attack

ఇదిలాఉండగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(ayatollah-ali-khamenei) మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలు, వైమానిక స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అయితే ఈ దాడులు ప్రాంతీయ ఘర్షణకు దారితీసే ప్రమాదముందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితులను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. 

Also Read: గల్ఫ్‌ దేశాల్లో యుద్ధ మేఘాలు.. భారతీయుల కోసం రంగంలోకి ప్రధాని మోదీ

సౌదీ అరేబియా, UAE, ఖతర్, బహ్రెయిన్ రాజులతో పుతిన్ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మరో 40 మందికి పైగా సీనియర్ నేతలు చనిపోయారు. మరోవైపు ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు