NATS: నాట్స్‌ నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందడి

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS)కు నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమాణ స్వీకారం చేయించారు.

New Update
Srihari Mandadi is the new president of NATS

Srihari Mandadi is the new president of NATS

 NATS:  అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్‌కు నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో నాట్స్ (NATS) అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, శ్రీహరి మందాడి చే నాట్స్ అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేయించారు.నాట్స్‌లో ఓ సాధారణ సభ్యుడి నుంచి నాట్స్ అధ్యక్ష స్థానం వరకు చేరుకున్న శ్రీహరి మందాడి  పై నాట్స్ నాయకత్వం ప్రశంసల వర్షం కురిపించింది. నాట్స్‌లో కష్టపడే ప్రతి ఒక్కరికి  కచ్చితంగా అవకాశం కల్పిస్తుందని ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీహరి మందాడి.. ఈ రోజు వ్యాపారంలో.. సేవా రంగంలో దూసుకుపోవడం నిజంగా అభినందించదగ్గ విషయమని అన్నారు.

Also Read: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!


న్యూజెర్సీ లో ఏ చిన్న కార్యక్రమంలోనైనా తన సేవలు కూడా ఉండాలని తపించే వ్యక్తి శ్రీహరి అని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సర్వీస్ చైర్మన్, నాట్స్ బోర్డ్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ అన్నారు. నాట్స్ అధ్యక్షునిగా కూడా శ్రీహరి కొత్త విజయాలు సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. నాట్స్ నాయకులు, నాట్స్ సభ్యులతో పాటు దాదాపు 700 మందికి పైగా తెలుగు వారు ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్

 ఈసందర్భంగా శ్రీహరి మందడి మాట్లాడారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, నాట్స్ కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ సంస్థ అటు తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇటు అమెరికాలో వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని శ్రీహరి మందడి తెలిపారు. జులై 4, 5, 6 తేదీల్లో.. ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో జరిగే 8వ నాట్స్ కాన్ఫరెన్స్‌ సంబరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంబరాల్లో అగ్ర నటులు నందమూరి బాలకృష్ణ, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌తోపాటు.. తమన్, దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. నాట్స్ సంబరాల నిర్వహణ కోసం నిధుల సేకరణకు భారీ స్పందన వచ్చిందని వెల్లడించారు. దాదాపు నాలుగు లక్షల డాలర్లకు హామీ లభించిందని వివరించారు.
  Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

Also Read: బెంగళూరు తొక్కిసలాట ఏ సమయంలో జరిగిందంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు