/rtv/media/media_files/2025/04/05/ssZ9xEWN0GBAyLANtYgt.jpg)
Russia Attack on Ukraine
రష్యా, ఉక్రెయిన్ ల మద్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 41 యుద్ధ విమానాలు ధ్వంసం చేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు. రష్యాను క్రిమియాతో కలిపే బ్రిడ్జిను ఉక్రెయిన్ పేల్చేసింది. నీటిలో బాంబ్ పెట్టి ఉక్రెయిన్ ఆర్మీ భారీ పేలుడు జరిపింది. బ్రిడ్జి పిల్లర్లకు 11 వందల కేజీల TNT బాంబు అమర్చారు. ఇప్పటివరకూ ఉక్రెయిన్ 3 సార్లు బ్రిడ్జిని కూల్చివేసింది. క్రిమియా - రష్యా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ క్షిపణులతో దాడులు..
దీనికి ప్రతిగా ఇప్పుడు రష్యా దాడులను చేస్తోంది. దీనిపై అమెరికా అధ్యక్షుటు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. అయినా సరే ఆ దే: తన పట్టు విడవడం లేదు.తాము దాడులకు పాల్పడి తీరతామని రష్యా స్పష్టం చేసిందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఉక్రెయిన్ రాజధానిపై రష్యా విరుచుకుపడుతోంది. భారీ క్షిపణులతో దాడులు చేస్తోంది. అంతకు ముందు కూడా రష్యా కూడా 400లకు పైగా డ్రోన్లతో కీవ్పై విరుచుకుపడింది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత భీకరంగా మారింది. 24 గంటల్లో 1430 మందికి పైగా ఉక్రెయిన్ సైనికుల మృతి చెందినట్లు సమాచారం. కివ్లో డ్రోన్లు, క్షిపణులు, ఆర్మీ వాహనాలు ధ్వంసమైయ్యాయి.
🔥🚨BREAKING NEWS: Kyiv Ukraine is currently under heavy bombardment as powerful explosions hit their capital. Russia is attacking full force. pic.twitter.com/LaApSgLNCK
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) June 6, 2025
Also Read: TS: ఉద్యోగులకు డబుల్ డీఏ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం