/rtv/media/media_files/2025/10/05/rains-2025-10-05-17-15-44.jpg)
Rain-triggered landslides, floods kill at least 63 in Nepal, India
నేపాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు. మొత్తంగా వరదల ప్రభావానికి 60 మంది మృతి చెందినట్లు ఆదివారం అధికారులు వెల్లడించాయి. శుక్రవారం నుంచి నేపాల్లో భారీ వర్షాలు కురవడంతో నదులు ఉప్పొంగుతున్నాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి, మరికొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి.
Also Read: బతుకమ్మ ఆడుతూ కుప్పకూలిన నవ వధువు.. హాస్పటల్ కు వెళ్తే షాకింగ్ న్యూస్!
Heavy rainfall across the Kathmandu Valley today has caused the Bagmati River to swell significantly, leading to elevated water levels and localized flooding risks.
— Naveen Reddy (@navin_ankampali) October 5, 2025
📍Sanepa Bridge
🎥Trending Nepal pic.twitter.com/WN0xTR733e
నేపాల్లోని ఇలాం జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఏకంగా 37 మంది చెందారు. రాత్రి భారీగా వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని అక్కడి జిల్లా అధికారి సునీతా నేపాల్ తెలిపారు. అనేక రోడ్లు బ్లాక్ అయ్యాయని.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాజధాని ఖట్మాండ్లో కూడా వర్షాల ధాటికి నదులు పొంగిపోర్లుతున్నాయి. అక్కడి స్థానికులను భద్రతా సిబ్బంది హెలికాప్టర్లు, మోటార్ బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: ఇన్సూరెన్స్ డబ్బులకోసం దారుణం..వ్యక్తిని చంపి భార్యగా నమ్మించి...ట్విస్ట్ ఏంటంటే?
Nepal has released enormous amount of water and all 58 gares of Kosi barrage is now open.
— With Love Bihar (@WithLoveBihar) October 5, 2025
North Bihar, please brace for the floods.
pic.twitter.com/1BQsRq7mfW
ఇక నేపాల్ సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో వరదల ప్రభావానికి 20 మంది మృతి చెందారు. రాత్రి భారీగా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ కూడా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.