Shahbaz Sharif: భారత్ దెబ్బకు ఆసుపత్రిలో చేరిన పాక్ ప్రధాని? సోషల్ మీడియాలో వార్తలు..

పహల్గామ్ దాడి తరువాత ఐదు పెద్ద నిర్ణయాలతో పాక్ ను తేరుకోలేని దెబ్బ కొట్టింది భారత్. ఇది ఎంత గట్టిగా తగిలింది అంటే దెబ్బకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఆయన అనారోగ్యం పాలయ్యారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వస్తున్నాయి.  

author-image
By Manogna alamuru
New Update
పాకిస్తాన్

పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్

ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఫహల్గామ్ లో దాడి చేసి భారత్ ను దెబ్బ తీద్దామనుకుంది పాకిస్తాన్. ఇండియా ఏమీ చేయలేదు అనుకుంది. కానీ మన దేశం పాక్ ఊహించిన షాక్ ఇచ్చింది. దీంతో ఆ దేశం విలవిలలాడుతోంది. కక్కలేక మింగలేక చేస్తోంది. పైగా ప్రపంచ దేశాలు దాదాపు అన్నీ భారత్ కే సపోర్ట్ చేస్తున్నాయి. పైకి బీరాలు పోతూ యుద్ధానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది కానీ...అంతకు ముందే భారత్ కొట్టిన ఐదు నిర్ణయాల దెబ్బకు పోలీసు దెబ్బలు తిన్న దొంగలా నానా బాధ పడిపోతోంది.  అన్ని వైపుల నుంచి దిగ్భంధనం చేసేసి పాక్ కు ఊపిరి ఆడనియ్యకుండా చేసింది ఇండియా. దీంతో ఏం చేయాలో తెలియక...అందులో నుంచి బయటకు ఎలా రావాలో తూచక బిక్కుబిక్కుమంటోంది. 

Also Read: Dhanush 56: పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

Also Read:  Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?

ఆసుపత్రిలో ప్రధాని...

భారత్ ఇచ్చిన షాక్ కు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ గిలగిలా కొట్టుకుంటున్నారు. అందులో నుంచి బయటకు ఎలా రావాలో తెలియక అనారోగ్యం పాలయ్యారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశారని కూడా చెబుతున్నారు.  అయితే షాబాజ్ కు ఏం జరిగిందో మాత్రం ఇంకా బయటకు రాలేదు.  కానీ దీనికి సంబంధించి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కనీసం ప్రభుత్వ అఫీషియల్స్ ద్వారా కూడా ఎలాంటి వార్త బయటకు రాలేదు. 

 

today-latest-news-in-telugu

Also Read: Vaibhav Surya Vamsi: వీడు మామూలు పిల్లాడు..రికార్డుల పిడుగు

Also Read: Samantha Temple బర్త్ డే రోజున సమంతకు ఏకంగా గుడి కట్టించిన అభిమాని.. నెట్టింట వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు